గ్రేటెస్ట్ ప్లేయర్ రోహిత్.. మీకు కనిపించలేదా.. ఫ్యాన్స్ ఫైర్?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎవరు అంటే ప్రతి ఒక్కరు కూడా రోహిత్ శర్మ పేరు చెబుతూ ఉంటారు. ఎందుకంటే జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించి ఇక ఐదు సార్లు టైటిల్ అందించిన ఘనత రోహిత్ శర్మకు సాధ్యం. ఇక ఎంతోమంది దిగ్గజాలు సాధించలేనిది ముంబై ఇండియన్స్ కి రోహిత్ సాధించి పెట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ జట్టును ఏకంగా ఛాంపియన్ టీంగా నిలపడంలో అతను కీలకపాత్ర వహించాడు.

 అలాంటి ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకి గత కొంతకాలం నుంచి చేదు అనుభవాలు ఎదురవుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఐదుసార్లు టైటిల్ అందించిన కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మను సారధ్య బాధ్యతలు నుంచి జట్టు యాజమాన్యం తప్పించింది. దీంతో రోహిత్ అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు. ఇక హార్దిక్ పాండ్యాకు కొత్త కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవలే రోహిత్ అభిమానులు అందరూ కూడా మరింత ఆగ్రహం వ్యక్తం చేసే మరో ఘటన జరిగింది. ఆల్ టైం గ్రేటెస్ట్ ఐపీఎల్ టీమ్ ని స్టార్ స్పోర్ట్స్ ఇటీవల ప్రకటించింది.

 ఇప్పటివరకు ఐపిఎల్ హిస్టరీలో అద్భుతంగా రానించిన ప్లేయర్లు అందరిని కూడా ఇందులో చేర్చింది. కానీ ఇందులో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం చోటు ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో రోహిత్ అభిమానులు తీవ్ర అసహన వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో 6211 పరుగులతో నాలుగో అత్యధిక పరుగుల స్కోరర్ గా ఉన్న రోహిత్ శర్మను.. ఆల్ టైం గ్రేటెస్ట్ ప్లేయర్ కాదా అంటూ రోహిత్ అభిమానులు సోషల్ మీడియా వేదిక ప్రశ్నిస్తున్నారు. 2013 నుంచి తన సారద్యంలో ముంబై ఇండియన్స్ జట్టును ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిపిన కెప్టెన్ గా ఉన్న రోహిత్ ను ఆల్ టైం గ్రేటెస్ట్ ఐపీఎల్ టీమ్ లో చేర్చడం ఎలా మర్చిపోయారు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: