రోహిత్ శర్మ.. నాకు నిద్రలేని రాత్రులు మిగిల్చాడు.. గంభీర్ కీలక వ్యాఖ్యలు?

praveen
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ భారత క్రికెట్కి చేసిన సేవలు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీ లో భారత జట్టు రెండుసార్లు వరల్డ్ కప్ గెలిచింది అన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఇక ఇలా వరల్డ్ కప్ గెలవడంలో భారత జట్టులో సభ్యుడుగా ఉన్న గౌతం గంభీర్ వీరోచితమైన పోరాటం చేశారు అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. టీమిండియాకు మంచి ఆరంభాలు అందించాడు. కీలకమైన నాకౌట్ మ్యాచ్ లలో కూడా టీమ్ ఇండియాకు ఇక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఇక జట్టును విజయతీరాలకు నడిపించాడు అని చెప్పాలి. అయితే గౌతమ్ గంభీర్ క్రికెట్ తో మాత్రమే కాదు వివాదాలతో కూడా ఎప్పుడూ వార్తలు నిలుస్తూ ఉంటాడు.

 ఏది ఉన్న మనసులో పెట్టుకోకుండా ముక్కు సూటిగా మాట్లాడే గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిఫై గురించి ఎన్నోసార్లు షాకింగ్ కామెంట్స్ చేసి వార్తలో నిలిచాడు. మరో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో వివాదాన్ని కూడా పెట్టుకొని సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు కూడా గురయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్ శర్మ కారణంగా తనకు ఎన్నో నిద్రలేని రాత్రులు మిగిలాయి అంటూ గౌతమ్ గంభీర్ చేసిన కామెంట్స్ కాస్త వైరల్గా మారిపోయాయి. కాగా ఐపీఎల్లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉన్న సమయంలోనే మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ ఐపీఎల్లోని కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు సారధిగా వ్యవహరించాడు.

 అతని సారధ్యంలోనే రెండుసార్లు  కోల్కతా జట్టు ఇక ఐపీఎల్ టైటిల్ ని కూడా గెలుచుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత కెప్టెన్ హిట్ మ్యాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు గంభీర్. ఐపీఎల్ లో ఆడుతున్న సమయంలో రోహిత్ శర్మ తనకు నిద్రలేని రాత్రులు మిగిల్చాడు అంటూ కామెంట్ చేశాడు. రోహిత్ శర్మను ఎదురుకునేందుకు నిద్ర మానుకొని చాలా ప్రణాలికలను రచించేవాడిని. ఏ ఇతర బ్యాటర్ల విషయంలోనూ ఇలా ఆలోచించే వాడిని కాదు అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ కెరియర్లో 154 మ్యాచ్లలో 4218 పరుగులు చేశాడు గౌతమ్ గంభీర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: