ఎట్టకేలకు.. దిగొచ్చిన ఇషాన్ కిషన్?

praveen
టీమిండియా స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ విషయంలో గత కొంతకాలం నుంచి సందిగ్ధత నెలకొంది అన్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా పర్యటన కోసం ఎంపికైన ఇషాన్ కిషన్ ఇక మానసిక ఆలసట ఉంది అనే కారణం చెప్పి జట్టు నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా దక్షిణాఫ్రికా పర్యటన నుంచి స్వదేశానికి వచ్చిన ఇషాన్ కిషన్ ఎక్కడ క్రికెట్ ప్రాక్టీస్ లో మాత్రం కనిపించలేదు. దీంతో అతను మళ్ళీ టీమ్ ఇండియాలోకి రావాలి అంటే రంజీ ట్రోఫీలో ఆడాలి అంటూ అప్పటికే టీమ్ ఇండియా హెడ్ కోచ్గా ఉన్న రాహుల్ ద్రవిడ్ స్పష్టం  చేశాడు.

 అయినప్పటికీ అటు ఇషాన్ కిషన్ మాత్రం హెడ్ కోచ్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ రాంజీ ట్రోఫీ మ్యాచ్లకు దూరంగానే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతను తీసుకున్న ఇలాంటి నిర్ణయం అతని కెరియర్ ను ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇక అతన్ని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా తొలగించేందుకు బీసీసీఐ పెద్దలు సిద్ధమయ్యారు అంటూ వార్తలు కూడా వచ్చాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇన్నాళ్ల వరకు మానసిక అలసట అని చెప్పి క్రికెట్కు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ ఎట్టకేలకు దిగొచ్చాడు అన్నది తెలుస్తోంది.

 దక్షిణాఫ్రికా టూర్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న తర్వాత ఒక్కసారి కూడా క్రికెట్ ఆడలేదు ఇషాన్ కిషన్. ఈ క్రమంలోనే అతనిపై గుర్రుగా ఉన్న బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించాలని నిర్ణయించింది. దీంతో ఇక అప్రమత్తమైన ఇషాన్ కిషన్ డివై పాటిల్ టోర్నీలో ఆడాలని నిర్ణయించుకున్నాడు అన్నది తెలుస్తుంది. ఈ మేరకు ఆయన సన్నిహితుల నుంచి సమాచారం అందింది. ఈ క్రమంలోనే.. ఇషాన్ కిషన్ డివై పాటిల్ టోర్నీలో ఆడతాడా లేదా అన్నది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: