ఎట్టకేలకు.. దిగొచ్చిన ఇషాన్ కిషన్?
అయినప్పటికీ అటు ఇషాన్ కిషన్ మాత్రం హెడ్ కోచ్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ రాంజీ ట్రోఫీ మ్యాచ్లకు దూరంగానే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతను తీసుకున్న ఇలాంటి నిర్ణయం అతని కెరియర్ ను ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇక అతన్ని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా తొలగించేందుకు బీసీసీఐ పెద్దలు సిద్ధమయ్యారు అంటూ వార్తలు కూడా వచ్చాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇన్నాళ్ల వరకు మానసిక అలసట అని చెప్పి క్రికెట్కు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ ఎట్టకేలకు దిగొచ్చాడు అన్నది తెలుస్తోంది.
దక్షిణాఫ్రికా టూర్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న తర్వాత ఒక్కసారి కూడా క్రికెట్ ఆడలేదు ఇషాన్ కిషన్. ఈ క్రమంలోనే అతనిపై గుర్రుగా ఉన్న బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించాలని నిర్ణయించింది. దీంతో ఇక అప్రమత్తమైన ఇషాన్ కిషన్ డివై పాటిల్ టోర్నీలో ఆడాలని నిర్ణయించుకున్నాడు అన్నది తెలుస్తుంది. ఈ మేరకు ఆయన సన్నిహితుల నుంచి సమాచారం అందింది. ఈ క్రమంలోనే.. ఇషాన్ కిషన్ డివై పాటిల్ టోర్నీలో ఆడతాడా లేదా అన్నది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది.