మ్యాచ్ జరుగుతుంటే.. ప్లేయర్ పై ఎలా పిడుగు పడిందో చూడండి?

praveen
సాధారణంగా మనిషి మనుగడకు ప్రకృతిలోని ప్రతి విషయం కూడా తోడ్పాటును అందిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అందమైన ప్రకృతి మనిషిలో ఆహ్లాదాన్ని కూడా నింపుతూ ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం అలాంటి ప్రకృతి చివరికి మనిషి ప్రాణాలను సెకండ్ల వ్యవధిలో అటు గాల్లో కలిపేయ్యగలదు. ఇలా ప్రకృతి విపత్తుల కారణంగా ప్రపంచంలో ఎక్కడో ఓ చోట ప్రతిరోజూ చాలామంది ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇలాంటి తరహా వీడియోలు ఇంటర్నెట్లోకి వస్తు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అయితే ఇలాంటి ప్రకృతి విపత్తులలో పిడుగుపాటు కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే.

 అంత సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఆకాశం నుంచి ఒక్కసారిగా పిడుగు పడి కేవలం చూస్తూ చూస్తుండగానే సెకండ్ల  వ్యవదిలో చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అందుకే వర్షం కురుస్తున్నప్పుడు గానీ ఉరుములు ఉరుముతున్నప్పుడు గానీ కాస్త జాగ్రత్తగా ఉండాలని అందరూ చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏకంగా విధి పగబట్టినట్లుగానే వ్యవహరిస్తూ.. ఇలాంటి పిడుగుపాటుతో ప్రాణాలను గాల్లో కలిపేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగిపోతున్నారు అని చెప్పాలి.

 ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఏకంగా గ్రౌండ్ మధ్యలో పిడుగు పడింది. అది కూడా మ్యాచ్ ఆడుతున్న ప్లేయర్ పై పిడుగు పడటంతో అతను ఒక్కసారిగా కుప్ప కూలిపోయి ప్రాణాలు వదిలాడు. ఈ షాకింగ్ ఘటన ఇండోనేషియాలోని సిలువగీ స్టేడియంలో వెలుగులోకి వచ్చింది. ఎఫ్ సి బాండుంగ్, ఎఫ్బీఐ సుభాన్ జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో ఉన్న ప్లేయర్ పై పిడుగు పడింది. దీంతో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే మిగతా ప్లేయర్లు అతని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ ప్లేయర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: