2024 ఐపీఎల్ కి.. ఆ నలుగురు ఇండియన్ స్టార్స్ దూరం కాబోతున్నారా?

praveen
2024 ఐపీఎల్ టోర్నీ గురించి బీసీసీఐ అన్ని సన్నహాలు చేస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. మార్చ్ 22వ తేదీ నుంచి ఈ ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కాబోతుంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇక అన్ని టీమ్స్ కూడా ఈసారి టైటిల్ గెలవడమె లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కావడానికి ఇంకా చాలా రోజుల సమయం ఉన్నప్పటికీ.. ఈ టోర్నికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. కాగా సరిగ్గా టి20 వరల్డ్ కప్ కి ముందు జరుగుతున్న టోర్నీ కావడంతో ఈ టోర్నీలో సత్తా చాటి చివరికి వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించుకోవాలని భావిస్తూ ఉన్నారు అందరూ టీమ్ ఇండియా ఆటగాళ్లు.

 అయితే 2024 ఐపీఎల్ టోర్ని మాత్రం ఏకంగా ఐదుగురు స్టార్ ప్లేయర్లు దూరం కాబోతున్నారు అన్నది తెలుస్తుంది. అదికూడా ఈ ఏడాది జరగబోయే టి20 వరల్డ్ కప్ లో ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్న ఆటగాళ్లే ఇక జట్టుకు దూరం అవుతున్నారు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గాయాల పాలైన సదరు టాప్ 5 ప్లేయర్స్ చివరికి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ ఐదుగురు ఆటగాళ్లు దూరం అవడం మాత్రం వారు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమ్స్ కి పెద్ద ఎదురు దెబ్బ లాంటిది. ఇంతకీ ఆ అయిదుగురు టాప్ ప్లేయర్స్ ఎవరో కాదు.. గత ఏడాది జరిగిన వరల్డ్కప్ లో అదరగొట్టిన మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ తో పాటు పృథ్వి షా రిషబ్ పంత్ లు కూడా ఉన్నారు అని చెప్పాలి.

 అయితే ఈ అందరు ప్లేయర్లు గతంలో టీమిండియాకు ఆడిన వారే కావడం గమనార్హం. తమ ఆట తీరుతో ఎన్నోసార్లు భారత జట్టుకు విజయాన్ని అందించిన స్టార్ ప్లేయర్లు వీళ్ళు. ఇక ఐపీఎల్ టోర్నిలో ఈ స్టార్ ప్లేయర్లు ఎంత చాటుతూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఈ ఐదుగురు ప్లేయర్లు 2024 ఐపీఎల్ టోర్నీకి దూరం కాబోతున్నారు అనేది తెలుస్తుంది. టి20 ర్యాంకింగ్స్ లో టాప్ లో నెంబర్ వన్ ప్లేయర్గా కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ ఇప్పటికే టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. ఇక ఐపీఎల్ నాటికి అతను కోలుకోవడం అనుమానమే. ఇక మహమ్మద్ షమి ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. దీంతో ఐపీఎల్ కు దూరం కానున్నాడు. హార్దిక్ పాండ్యా, పృథ్వి షా రిషబ్ పంతులు విషయంలో కూడా ఇదే జరగబోతుంది అనేది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: