టీ20 వరల్డ్ కప్ లో.. అతనే టీమ్ ఇండియాను గెలిపించేది : జహీర్ ఖాన్

praveen
ఈ ఏడాది టి20 వరల్డ్ కప్ జరగబోతుంది. జూన్ 1వ తేదీ నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఎవరు విజేతగా నిలుస్తారు అన్న విషయం హాట్ టాపిక్గా మారిపోయింది. అయితే ఇక ప్రపంచకప్ ప్రారంభానికి ఇంకా కొన్ని నెలల సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఐసీసీ టోర్నీ గురించి అటు చర్చ జరుగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక భారత క్రికెట్ లో ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తున్నారు. టి20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎవరు ఉంటే బాగుంటుంది అనే విషయంపై తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు అని చెప్పాలి.

 ఏకంగా టి20 వరల్డ్ కప్ 2024 కోసం జట్టులోని ఫేసర్లలో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది.. ఇక బ్యాట్స్మెన్ లలో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి అనే విషయంపై మాజీ ప్లేయర్లు ఇస్తున్న రివ్యూలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ గా మారిపోతున్నాయ్. ఇక ఇటీవల ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు జహీర్ ఖాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టి20 వరల్డ్ కప్ కోసం భారత జట్టులోకి ఎంపిక చేయాల్సిన నలుగురు పేర్లను జహీర్ఖాన్ వెల్లడించాడు. తప్పకుండా ఈ వరల్డ్ కప్ టోర్నీలో మహమ్మద్ షమీ ఎక్స్ ఫాక్టర్ ఆప్షన్ అవుతాడు అంటూ జహీర్ ఖాన్ చెప్పడం విశేషం.

 అంతేకాకుండా టి20 వరల్డ్ కప్ లో బుమ్రా సిరాజ్ లు కచ్చితంగా జట్టులో ఉంటారని నేను భావిస్తున్నాను. ఇక వాళ్ల తర్వాత అర్షదీప్ రూపంలో టీమిండియా కు మరో ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇక అతని బౌలింగ్లో కాస్త వేరియేషన్ లభిస్తుంది. అతను లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కావడం టీమిండియా కు కలిసి వచ్చే అంశమే. ఇక మరోవైపు మంచి యార్కర్లు కూడా వేస్తాడు. ఇక షమీ జట్టులో ఎంతో కీలకం.. ఎందుకంటే అతడు ఫిట్గా ఉండి అందుబాటులో ఉంటే తప్పకుండా వరల్డ్ కప్ లో టీమిండియాకు ఎక్స్ ఫ్యాక్టర్ ఆప్షన్ అవుతాడు. అందువల్ల ఈ నలుగురు పేసర్లను కచ్చితంగా జట్టులోకి ఎంపిక చేస్తారని భావిస్తున్నాను అంటూ జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: