యసశ్వి, దూబేలకు.. బీసీసీఐ బంపర్ ఆఫర్?
అయితే యశస్వి జైష్వాల్ తో పాటు మరో యంగ్ ఆల్ రౌండర్ శివం దూబే సైతం తన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం అటు ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న టి20 సిరీస్లో ఎంత మంచి ప్రదర్శన చేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా రెండు మ్యాచ్ లలో కూడా హాఫ్ సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు శివం దూపే ఇక బౌలింగ్లో కూడా పరవాలేదు అనిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యాకు రీప్లేస్మెంట్ ఆల్ రౌండర్ దొరికేశాడు అంటూ ఎంతోమంది కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ ఇద్దరు క్రికెటర్లకు బిసిసిఐ బంపర్ ఆఫర్ ఇవ్వబోతుందట. ఏకంగా సెంట్రల్ కాంట్రాక్ట్ ఆఫర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త భారత క్రికెట్ సర్కిల్లో తెగచక్కర్లు కొడుతుంది. గత ఏడాది ఏకంగా 26 మంది ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్టు అందించింది బీసీసీఐ ఇక 2023 - 24 ఏడాదికి గాని బీసీసీ ఆటగాళ్ల జాబితాలో కొత్తగా యశస్వి జైస్వాల్ చేరే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఇది నిజమే అయితే ఇద్దరు యంగ్ క్రికెటర్లకు అదృష్టం వరించినట్లే అని చెప్పాలి