మహీ భాయ్.. కాస్త రైనా మాట వినండి : దూబే

praveen
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్తో టీమిండియా మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టి20 సిరీస్ లో  సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మల మీదే ఉన్నాయ్. ఎందుకంటే 2022 t20 వరల్డ్ కప్ తర్వాత ఈ సీనియర్లు పొట్టి ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కాగా 2024 t20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని మళ్ళీ టి20 ఫార్మట్ లో అడుగుపెట్టారు  దాదాపు 14 నెలల తర్వాత పోటీ ఫార్మట్ లో మ్యాచ్లు ఆడెందుకు సిద్ధమయ్యారు.

 ఈ క్రమంలోనే ఇద్దరు సీనియర్ ప్రేయర్ల ప్రదర్శన ఎలా ఉంటుంది అని చూడ్డానికి అభిమానులు అందరూ కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూశారు అని చెప్పాలి. అయితే ఇక వీరితో పాటు యువ ఆటగాళ్ళు ఎలా రాణిస్తారు అనే విషయంపై కూడా చర్చ జరిగింది. అయితే ఇటీవల మొహాలీ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ లో తన ప్రదర్శనలతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. ఆల్రౌండర్ శివం దూబే ఏకంగా ఒక్కడే వారియర్ లాగా పోరాడి ఒంటి చేత్తో జట్టుకు విజయం అందించాడు. బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్లో కూడా మెరిసి అదరహో అనిపించాడు. అయితే మ్యాచ్ అనంతరం శివం దూబే మాజీ ఆటగాడు సురేష్ రైనా మధ్య జరిగిన సంభాషణ వైరల్ గా మారింది.

 దూబే ప్రదర్శనకు ఇంప్రెస్ అయిన నీ పర్ఫామెన్స్ చూస్తే ధోని.. నీకు ఐపిఎల్ లో 3 ఓవర్లు కచ్చితంగా ఇస్తాడు అంటూ కామెంట్ చేశాడు. దీనికి దూబే స్పందిస్తూ ధోని భాయ్ నన్ను పట్టించుకోండి.. సురేష్ రైనా చెప్పిన మాట వినండి అంటూ సరదాగా కామెంట్ చేశాడు. కాగా 2023 సీజన్లు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోని కెప్టెన్సీలో ఆడాడు శివం దూబే. విధ్వంసకర బ్యాటింగ్ తో భారీగా పరుగులు చేశాడు అని చెప్పాలి. ఇక అతను ఇలాగే ఆడితే ఇక టి20 వరల్డ్ కప్ లో సెలెక్ట్ అయిన ఆశ్చర్య పోనక్కర్లేదు అని ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: