తను చావడమే కాదు.. ఆరు నెలల కూతురుని కూడా చంపేసింది.. ఏం జరిగిందంటే?

praveen
ఆత్మహత్య.. ఈ మధ్యకాలంలో తరచూ వినిపిస్తున్న పదం. ఎన్నో కుటుంబాల్లో విశ్వదాన్ని నింపుతున్న పదం. ఇక ఇటీవల కాలంలో సమస్య వచ్చిన ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరికి గుర్తుకు వస్తున్న పదం కూడా ఇదే. ఎందుకంటే ఏ చిన్న సమస్య వచ్చినా దానికి పరిష్కారం ఒకటే ఆత్మహత్య అనే విధంగా మనుషుల ఆలోచన తీరు మారిపోయింది అని చెప్పాలి. దీంతో చిన్న చిన్న కారణాలతోనే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇలాంటి ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతూ ఉన్నాయి అని చెప్పాలి.

 ఆత్మహత్య చేసుకోవడానికి ముందు వెనక ఆలోచించకుండా చివరికి కఠిన నిర్ణయాలు తీసుకుంటూ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగానే ముగిస్తున్నారు చాలామంది. ఇక ఇలాంటి ఘటనలు చూస్తుంటే నేటి సభ్య సమాజంలో మనుషుల్లో విచక్షణ జ్ఞానం పూర్తిగా తగ్గిపోతుందేమో అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది. అయితే ఇటీవల ఇలాంటి ఆత్మహత్యకు సంబంధించిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ తన ఆరు నెలల కుమార్తెతో కలిసి అపార్ట్మెంట్ బిల్డింగ్ లోని 16 వ అంతస్తు నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంది.

 ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తర ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విశ్రాక్ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలో లా రెసిడెన్షియల్ సొసైటీలో జరిగిన ఈ ఘటనలో తల్లి చిన్నారి ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు అని చెప్పాలి.  మృతురాలని 33 ఏళ్ల సారికగా గుర్తించారు పోలిసులు. అనారోగ్యం వల్ల ఆమె గత కొంతకాలం నుంచి డిప్రెషన్ తో బాధపడుతుందని బంధువులు పోలీసులకు తెలిపారు. ఇక తల్లి బిడ్డ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: