యో చూసుకోబడ్ల.. రోహిత్ రన్ ఔట్ పై ఫ్యాన్స్ కామెంట్స్?

praveen
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దాదాపు 14 నెలల విరామం తర్వాత.. ఇటీవల టీ20 ఫార్మాట్లో మొదటి మ్యాచ్ ఆడాడు అన్న విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో ఇక రోహిత్ ఆడాడు. ఎందుకంటే 2022 t20 వరల్డ్ కప్ తర్వాత ఈ ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు రోహిత్ శర్మ. రోహిత్తో పాటు విరాట్ కోహ్లీ కూడా పొట్టి ఫార్మాట్ కు దూరంగానే ఉన్నారు. అయితే 2024 t20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈ సీనియర్ ప్లేయర్లను పొట్టి ఫార్మాట్ లోకి సెలక్ట్ చేశారు సెలెక్టర్లు.

 అయితే ఇక ఎంతో గ్యాప్ తర్వాత రోహిత్ శర్మ టి20 ఫార్మాట్లో మ్యాచ్ ఆడుతూ ఉండడంతో మొదటి మ్యాచ్ లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడు అని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ అభిమానులందరికీ కూడా నిరాశ ఎదురయింది అని చెప్పాలి. ఎందుకంటే ఇక 14 నెలల తర్వాత మొదటి టీ20 మ్యాచ్ ఆడిన రోహిత్ శర్మ.. ఇక ఈ మ్యాచ్ లో డక్ ఔట్ గా వెను తిరిగాడు. మరో ఓపెనర్ శుభమన్ గిల్ తో సమన్వయ లోపం కారణంగా పరుగుల ఖాతా తెరవకుండానే రన్ అవుట్ అయి పెవిలియన్ చేరాడు అని చెప్పాలి.

 అయితే ఇలా రన్ అవుట్ తో తీవ్ర నిరాశలో మునిగిపోయాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే గిల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక అసంతృప్తితో డగ్ అవుట్ కి చేరాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే రోహిత్ డక్ అవుట్ అయిన వీడియోలు వైరల్ గా మారిపోవడంతో ఎంతోమంది సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్లు చేస్తూ ఉన్నారు. తెలుగు ఫాన్స్ అయితే యో చూసుకోబడ్ల అంటూ ఇక సోషల్ మీడియాలో వైరల్ గా మారే డైలాగులతో ఇక ఎన్నో రకాల వీడియోలను వైరల్ గా మార్చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: