జట్టు నుంచి తప్పుకుని దుబాయ్ లో పార్టీలు.. అందుకే అతనిపై వేటు వేశారా?

praveen
ఇటీవల కాలం లో భారత క్రికెట్ లో యువ ఆటగాళ్ళదే హవా పెరిగి పోయింది అన్న విషయం తెలిసింది. ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ జట్టులో వరుసగా ఛాన్సులు దక్కించుకుంటూ తమ సత్తా ఏంటో నిరూపించుకుంటున్నారు. అయితే ఇలా వరుసగా అవకాశాలు అందుకుంటున్న వారిలో ఇషాన్ కిషన్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్  గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

 ఇక టీమిండియాలో మూడు ఫార్మాట్లలో కూడా అవకాశాలు దక్కించుకుంటూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే మొన్నటికి మొన్న సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా అతను టెస్ట్ సిరీస్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు అన్న విషయం తెలిసిందే. మానసిక ఒత్తిడి కారణంగానే తనకు కొంత విశ్రాంతి కావాలని బీసీసీఐ సెలెక్టర్లను కోరినట్లు తెలుస్తుంది. వారి అంగీకారంతోనే అతను ఇక టెస్టు సిరీస్ నుంచి తప్పుకొని స్వదేశానికి వచ్చేసాడు. అయితే ఆఫ్గనిస్తాన్ లో జరగబోయే టీ20 సిరీస్ కు ఇషాన్ కిషన్కు జట్టులో చోటు దక్కుతుంది అని అందరూ అనుకున్నారు.

 కానీ ఊహించని రీతిలో అతని పరిగణ లోకి తీసుకోలేదు సెలెక్టర్లు. ఈ క్రమం లోనే ఇషాన్ కిషన్ ఎంపిక చేయక పోవడంపై ఒక వార్త ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. మానసిక అలసట అనే కారణం చెప్పి సౌత్ ఆఫ్రికా తో టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్న ఇషాన్ కిషన్ కుటుంబంతో కలిసి దుబాయి లో పార్టీలు చేసుకుంటున్నాడు అన్నది తెలుస్తుంది. ఈ క్రమం లోనే బిసిసిఐ ఏకంగా ఇషాన్ కిషన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి ఆఫ్గనిస్తాన్తో టి20 సిరీస్ కు ఎంపిక చేయలేదంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమం లోనే మానసిక ప్రశాంతత కోసం కుటుంబం తో కలిసి పార్టీలు చేసుకుంటే తప్పేంటి అని అతని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: