టీమిండియాకు బిగ్ షాక్.. ఆ ఇద్దరు దూరం?

praveen
ప్రస్తుతం టీమిండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీ బిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న సౌత్ ఆఫ్రికా పర్యటన ముగించుకుంది. అయితే 2024 కొత్త ఏడాదిని సౌత్ ఆఫ్రికా తో రెండో టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించి శుభారంభం చేసింది అని చెప్పాలి. అయితే జనవరి 11వ తేదీ నుంచి అటు ఆఫ్ఘనిస్తాన్తో టి20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది టీమ్ ఇండియా. ఈ క్రమంలోనే ఎన్నో రోజులుగా టి20 ఫార్మాట్ కు దూరంగా ఉంటున్న సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు మళ్ళీ జట్టులోకి వచ్చేసారు అని చెప్పాలి. ఇక మరోసారి చాలా రోజుల తర్వాత రోహిత్ శర్మ టి20 కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టే అవకాశం ఉంది.

 ఇలా జనవరి 11వ తేదీ నుంచి ఇండియా పర్యటనకు రాబోతున్న ఆఫ్గనిస్తాన్ తో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ జరగబోతుంది. అయితే ఈ టి20 సిరీస్ కి ముందు అటు భారత జట్టుకు బిగ్ షాక్ తగలబోతుంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా ఇక జట్టుకు దూరం కాబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ప్రస్తుతం గాయం బారిన పడ్డారు ఈ ఇద్దరు ప్లేయర్లు. సౌత్ ఆఫ్రికా తో జరిగిన టి20 సిరీస్ సమయంలో సూర్య కుమార్ యాదవ్ గాయం బారిన పడగా.. ఇక గత ఏడాది జరిగిన వరల్డ్ కప్ సమయంలోనే హార్దిక్ పాండ్య గాయం బారిన పడ్డాడు. అప్పటినుంచి ఇక పూర్తిగా క్రికెట్కు దూరం అయిపోయాడు అని చెప్పాలి.

 అయితే ఈ ఇద్దరు ప్లేయర్లు అటు ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే టి20 సిరీస్ నాటికి అందుబాటులోకి వస్తారని అందరూ అనుకున్నప్పటికీ.. టీమిండియా కు ఊహించని షాక్ తగిలింది అన్నది తెలుస్తుంది. గాయాలతో బాధపడుతున్న ఈ ఇద్దరు ప్లేయర్లు కూడా ఐపీఎల్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. అయితే రుతురాజ్ గైక్వాడ్ కి కూడా వేలిగాయం అయింది. అతను కూడా జట్టుకు దూరం కాబోతున్నాడు. ఇక ఈ  కీలక ప్లేయర్లు త్వరగా కోలుకోవాలని అటు అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: