2024లో.. ఆ ఇద్దరు క్రికెటర్లదే హవా ఖాయం?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఎన్నో మధురానుభూతులను ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చిన 2023 ఏడాది ముగిసింది. ఇక ఇప్పుడు అందరూ కూడా 2024 ఏడాదిని ప్రారంభించారు. అయితే మొన్నటి వరకు ఇక 2023 ఏడాది ముగింపు వరకు కూడా గత ఏడాదిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లు ఎవరు అన్న చర్చ సోషల్ మీడియాలో జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇదే విషయంపై సాధారణ క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు సైతం రివ్యూలు ఇచ్చేసారు. గతి ఏడాది మొత్తంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లు ఎవరు అన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 అయితే ఇక ఇప్పుడు 2024 కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఇక ఈ ఏడాదిలో అత్యుత్తమ ప్రదర్శన చేయబోయే ప్లేయర్స్ ఎవరు అన్న చర్చ మొదలైంది. ఇక ఇదే విషయంపై ఎప్పటిలాగానే ఎంతోమంది మాజీ ప్లేయర్లు క్రికెట్ విశ్లేషకులు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ఇలాంటి రివ్యూలు తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. కాగా ఇదే విషయంపై స్పందించిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ ఇక ఈ ఏడాదిలో అత్యుత్తమ ప్రదర్శన చేసి రికార్డులు కొల్లగొట్టబోయే ఆటగాళ్లు ఎవరు అన్న విషయాన్ని అంచనా వేశాడు.

 భారత జట్టులో స్టార్ బాట్స్మన్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజం 2024 ఏడాది మొత్తంలో అత్యుత్తమంగా రాణిస్తారు అని ఇంగ్లాండు మాజీ కెప్టెన్ నాజీర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్లో ఒక మెగాస్టార్. గత ఏడాది అద్భుతంగా ఆడాడు. అతడిలా బ్యాటింగ్ చేసే మరో ఆటగాడిని నేను ఇప్పటివరకు చూడలేదు. ఇక పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ కూడా ఈ ఏడాదిలో అద్భుతంగా రానించి భారీగా పరుగులు చేస్తాడు అని అనుకుంటున్నా. 2024 ఏడాది అతనికి గొప్ప సంవత్సరంగా మిగిలిపోవాలి అంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: