ఐపీఎల్ లో ఆడటంపై.. పండగ లాంటి న్యూస్ చెప్పిన ధోని?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్లో ఏ క్రికెటర్ కి సాధ్యం కాని రీతిలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఏ కెప్టెన్ కి సాధ్యం కాని రీతిలో భారత జట్టుకు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ను ఒకసారి కాదు ఏకంగా రెండుసార్లు అందించిన ఏకైక కెప్టెన్ తో కొనసాగుతూ ఉన్నాడు ధోని. అంతేకాదు ఇక మైదానంలో తన ఆట తీరుతో కూడా ప్రేక్షకుల హృదయాల్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు అని చెప్పాలి. కేవలం దిగ్గజ కెప్టెన్ గా మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్లో బెస్ట్ ఫినిషర్ గా బెస్ట్ వికెట్ కీపర్ గా కూడా ప్రస్తానాన్ని కొనసాగించాడు.


 ఒకరకంగా చెప్పాలంటే భారత క్రికెట్ అనే ఒక పుస్తకంలో ధోనీ కోసమే ప్రత్యేకంగా కొన్ని పేజీలు ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనూ ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ ని టీం ఇండియాకు అందించిన ఘనత కూడా ధోనీకి దక్కుతుంది. మహా మహా క్రికెటర్లు సైతం ఒక్కసారైనా ధోని కెప్టెన్సీ లో ఆడితే చాలు అని అనుకుంటారు అంటే ఇక సారథిగా అతను ఎంత గొప్ప విజయాలను సాధించాడు అర్థం చేసుకోవచ్చు. అయితే అంతర్జాతీయ క్రికెట్కు 2019లో వీడుకోలు పలికిన ధోని ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అంటూ ప్రచారం జరుగుతుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలిచింది. దీంతో ఇక 2024 ఐపీఎల్ కు ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో అభిమానులందరికీ కూడా పండగ లాంటి న్యూస్ చెప్పాడు ధోని. ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ధోని క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు అని వ్యాఖ్యాత ప్రసంగించిగా.. నేను అంతర్జాతీయ క్రికెట్కు మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించాను. ఐపీఎల్ కు కాదు అంటూ ధోని సమాధానం ఇచ్చాడు. దీంతో వచ్చే ఐపిఎల్ లో కూడా ధోని ఆడతాడని ఇండైరెక్టుగా చెప్పేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: