మా మీద మాకే కోపం, చిరాకు వస్తుంది : ఇంగ్లాండ్ కెప్టెన్

praveen
ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 ఎడిషన్ లో భాగంగా కొన్ని టీమ్స్ విషయంలో అభిమానులు పెట్టుకున్న అంచనాలు మొత్తం తారుమారు అయ్యాయి అని చెప్పాలి. మంచి ప్రదర్శన చేసి అదరగొడుతుంది అనుకునే టీమ్స్ దారుణంగా ఓడిపోయి చెత్త ప్రదర్శనలతో నిరాశ పరుస్తూ ఉన్నాయి. ప్రతి మ్యాచ్ లో కూడా భారి అంచనాలతో బరిలోకి దిగడం.. ఇక దారుణ ఓటమి చవి చూడటం జరుగుతూ వస్తుంది. ఏకంగా పసికూన టీమ్స్ చేతిలో సైతం పరాజయాలు పాలు అవుతుండడంతో ఈ ఓటములను అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి.


 అయితే ఇలా వరుస ఓటములతో సతమతవుతూన్న టీమ్ అనగానే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ జట్టు ఏదో కాదు డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో వరల్డ్ కప్ లో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ అని. ప్రస్తుతం ఇంగ్లాండ్ చూసుకుంటే అటు బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో కూడా పటిష్టంగా కనిపిస్తుంది. వరల్డ్ లోనే బెస్ట్ బ్యాటర్లు అని పిలుచుకునే వారు ఈ జట్టులో ఉన్నారు  కానీ పసికూన టీమ్స్ చేతిలో సైతం జట్టు ఓడిపోతూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. అయితే ఇటీవల సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలి అంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో శ్రీలంక చేతిలో 8 వికెట్ల తేడాతో దారుణంగా ఓడిపోయింది.


 ఈ క్రమంలోనే వరుస ఓటముల పై ఆ జట్టు కెప్టెన్ బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు  వరుస ఓటులతో మా ఆటగాళ్లందరూ కూడా నిరాశలో కూరుకు పోయారు  అంటూ చెప్పుకొచ్చాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయాం. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. కానీ మేము ఏమీ చేయలేకపోయాం. ప్రస్తుతం మా మీద మాకు విసుగు కోపం చిరాకు వస్తున్నాయి. వరుస ఓటములతో కుమిలిపోతున్నాం. కానీ తర్వాత మ్యాచ్ లో పుంజుకుని రాణిస్తాం అంటూ బట్లర్ చెప్పుకొచ్చాడు. కాగా వరుస ఓటములతో పాయింట్లు పట్టికలో చివరిలో ఉన్న ఇంగ్లాండ్కు దాదాపు సెమిస్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయినట్లే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: