ఆస్తులన్నీ అమ్ముకొని వచ్చి.. వరల్డ్ కప్ లో సెంచరీ చేసాడు?

praveen
ఎంతో ప్రతిష్టాత్మకమైన వన్డే వరల్డ్ కప్ లో భాగంగా మొదటి మ్యాచ్ నుంచే సెంచరీల మూత మోగించడం ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. ఒకటి కాదు ఏకంగా మొదటి మ్యాచ్ లోనే రెండు సెంచరీలు నమోదు అయ్యాయి. అక్టోబర్ 5వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్ లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తలబడ్డాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా న్యూజిలాండ్ క్రికెటర్లు ఇంగ్లాండ్ బౌలర్ల పై ఏకంగా పూనకం వచ్చినట్లుగా ఊగిపోయారు. సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయి సెంచరీల మోత మోగించారు అని చెప్పాలి.


 ఒకవైపు నుంచి న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ డేవాన్ కాన్వె సెంచరీ తో చెలరేగితే ఇక మరోవైపు రచన్ రవీంద్ర కూడా సెంచరీ నమోదు చేశాడు అని చెప్పాలి. అయితే ఇక ఇద్దరు బ్యాట్స్మెన్లు చూపించిన అసమాన్యమైన ప్రతిభ గురించి ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం చర్చించుకుంటూ ఉంటుంది అని చెప్పాలి. ముఖ్యంగా డేవాన్ కాన్వే గురించి పలు వివరాలు తెలుసుకొని క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ అవ్వుతున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు తరఫున ఆడుతూ ఆ జట్టు విజయం కోసం పోరాడుతున్న డేవాన్ కాన్వె అసలు న్యూజిలాండ్ కు చెందిన వాడు కాదట. అతనిది దక్షిణాఫ్రికా అన్న విషయం తెలిసి అందరూ కూడా షాక్ అవుతారు.


 డేవాన్ కాన్వె స్వస్థలం దక్షిణాఫ్రికా కాగా అక్కడ తన సొంత ఇల్లు ఆస్తులు కార్లు కూడా ఉన్నాయట. అయితే వాటన్నింటినీ అమ్ముకొని న్యూజిలాండ్ కు వలస వచ్చేసారూ డేవాన్ కాన్వె కుటుంబ సభ్యులు.  ఇక్కడ  కాన్వె స్కూల్లో కోచ్గా కెరియర్ ప్రారంభించాడు. కివీస్ తరఫున డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో అతనికి జాతీయ జట్టుకుఆడేందుకు ఆహ్వానం వచ్చింది అని చెప్పాలి. న్యూజిలాండ్ జాతీయ జట్టులోకి వచ్చినతర్వాత అద్భుతమైన ప్రదర్శన చేసి జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు అన్ స్టాఫబుల్ గా దూసుకుపోతున్నాడు. ఇక ఇటీవల ఇంగ్లాండుతో జరిగిన మ్యాచ్లో సెంచరీ తో చెలరేగిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: