IND vs AUS: రెండో వన్డేలో భారత్ సూపర్ విక్టరీ?

Purushottham Vinay
వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఏకంగా 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.ఇంకా ఇది మాత్రమే కాదు, ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత జట్టు తన సూపర్ రికార్డును కొనసాగించింది. ఈ గడ్డపై భారత జట్టుకు ఇది వరుసగా 7వ విజయం కావడం విశేషం. ఇక్కడ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో కూడా విజయం సాధించింది.ఆదివారం నాడు జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ని ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత మొత్తం 50 ఓవర్లలో 5 వికెట్లకు 399 పరుగులు చేసింది.ఇక 400 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది.ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు మొత్తం 399 పరుగులు చేసి కంగారూలకు 400 పరుగుల లక్ష్యాన్ని అందించింది.ఇక ఆస్ట్రేలియాపై కూడా వన్డే క్రికెట్‌లో భారత్‌కు ఇదే అతిపెద్ద స్కోరు. అంతకుముందు 2013 వ సంవత్సరంలో బెంగళూరులో భారత జట్టు మొత్తం 383 పరుగులు చేసింది.


ఆస్ట్రేలియా టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (104 పరుగులు) ఇంకా శ్రేయాస్ అయ్యర్ (105 పరుగులు) సెంచరీ ఇన్నింగ్స్ ఆడగా, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీలతో చక్కగా రాణించారు.ఆస్ట్రేలియా జట్టులో కెమరూన్ గ్రీన్ మొత్తం 2 వికెట్లు తీశాడు. జోష్ హేజిల్‌వుడ్, సీన్ అబాట్ ఇంకా ఆడమ్ జంపాలకు ఒక్కో వికెట్ దక్కింది.భారత్ టీం విషయానికి వస్తే..కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ ఇంకా ప్రసిద్ధ్ కృష్ణ టీం గా కొనసాగుతున్నారు.ఆస్ట్రేలియా టీం విషయానికి వస్తే..స్టీవ్ స్మిత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మాథ్యూ షార్ట్, మార్నస్ లాబుషాగ్నే, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్ ఇంకా స్పెన్సర్ జాన్సన్ టీంగా కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: