టీఎన్‌పీఎల్‌ 2023లో రింకూ సింగ్‌ను తలపించిన యువ క్రికెటర్.. ఒకే ఓవర్‌లో 4 సిక్సర్లు?

praveen
రింకూ సింగ్‌.. 2023 ఐపీఎల్ సీజన్ చూసిన వారెవరికీ ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఐపీఎల్‌ 16 సీజన్‌ మొత్తంలో ఈ ఆటగాడు హైలెట్‌గా నిలిచాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున వికెట్‌ కీపర్‌గా ఆడిన ఈ యువ ప్లేయర్ గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాదాడు. ఆ దెబ్బకు ఓడిపోతుందనుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అనూహ్య విజయం సాధించింది. ఆ ఒక్క మ్యాచ్‌తో రింకూ సింగ్‌ హీరో అయిపోయాడు. అయితే మళ్లీ అంతటి గొప్ప ఇన్నింగ్స్‌ను తలపించే బాటింగ్ చేసి వావ్ అనిపిస్తున్నాడు మరొక యువ ప్లేయర్.

ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌/టీఎన్‌పీఎల్‌ 2023 చాలా రసవత్తరంగా సాగుతోంది. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం నెల్లయ్‌ రాయల్‌ కింగ్స్‌, దిండిగుల్‌ డ్రాగన్స్‌ మధ్య ఓ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దిండిగల్ డ్రాగన్స్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 185 పరుగులు సాధించింది. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెల్లయ్‌ కింగ్స్‌ ఆటగాళ్లు రితిక్ ఈశ్వరన్‌, అజితేష్ గురుస్వామి ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించారు.

వారిద్దరి సాయంతో రాయల్ కింగ్స్ టీమ్ గెలుపు అంచుల వరకు వచ్చింది. చివరకు రెండు ఓవర్లలో అంటే 12 బంతుల్లో 37 రన్స్ చేయాల్సి వచ్చింది. అది ఒక పెద్ద ఛాలెంజ్‌గా నిలిచినా రితిక్, అజితేష్ అధైర్య పడలేదు. ఎలాగైనా సక్సెస్ సాధించాలనే పట్టుదలతో రితిక్ ఈశ్వరన్ తనలోని విధ్వంసకర బ్యాటర్‌ను బయటికి తీశాడు. ఈ యంగ్ క్రికెటర్ 19వ ఓవర్‌లో 4 సిక్సర్లు దంచాడు. మరోవైపు అజితేష్ ఓ సిక్సర్ కొట్టాడు. అదే ఓవర్ లో ఒక నోబాల్‌, సింగిల్ రన్‌ వచ్చింది. దాంతో 19 ఓవర్‌లో మొత్తంగా 33 పరుగులు వచ్చాయి. ఇక గెలుపు ఖాయం అనుకుంటున్న సమయంలో మరో సిక్సర్ కొట్టి రాయల్ కింగ్స్‌ను గెలిపించాడు రితిక్ ఈశ్వరన్‌.రింకూ సింగ్‌.. 2023 ఐపీఎల్ సీజన్ చూసిన వారెవరికీ ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఐపీఎల్‌ 16 సీజన్‌ మొత్తంలో ఈ ఆటగాడు హైలెట్‌గా నిలిచాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున వికెట్‌ కీపర్‌గా ఆడిన ఈ యువ ప్లేయర్ గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాదాడు. ఆ దెబ్బకు ఓడిపోతుందనుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అనూహ్య విజయం సాధించింది. ఆ ఒక్క మ్యాచ్‌తో రింకూ సింగ్‌ హీరో అయిపోయాడు. అయితే మళ్లీ అంతటి గొప్ప ఇన్నింగ్స్‌ను తలపించే బాటింగ్ చేసి వావ్ అనిపిస్తున్నాడు మరొక యువ ప్లేయర్.

ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌/టీఎన్‌పీఎల్‌ 2023 చాలా రసవత్తరంగా సాగుతోంది. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం నెల్లయ్‌ రాయల్‌ కింగ్స్‌, దిండిగుల్‌ డ్రాగన్స్‌ మధ్య ఓ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దిండిగల్ డ్రాగన్స్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 185 పరుగులు సాధించింది. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెల్లయ్‌ కింగ్స్‌ ఆటగాళ్లు రితిక్ ఈశ్వరన్‌, అజితేష్ గురుస్వామి ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించారు.

వారిద్దరి సాయంతో రాయల్ కింగ్స్ టీమ్ గెలుపు అంచుల వరకు వచ్చింది. చివరకు రెండు ఓవర్లలో అంటే 12 బంతుల్లో 37 రన్స్ చేయాల్సి వచ్చింది. అది ఒక పెద్ద ఛాలెంజ్‌గా నిలిచినా రితిక్, అజితేష్ అధైర్య పడలేదు. ఎలాగైనా సక్సెస్ సాధించాలనే పట్టుదలతో రితిక్ ఈశ్వరన్ తనలోని విధ్వంసకర బ్యాటర్‌ను బయటికి తీశాడు. ఈ యంగ్ క్రికెటర్ 19వ ఓవర్‌లో 4 సిక్సర్లు దంచాడు. మరోవైపు అజితేష్ ఓ సిక్సర్ కొట్టాడు. అదే ఓవర్ లో ఒక నోబాల్‌, సింగిల్ రన్‌ వచ్చింది. దాంతో 19 ఓవర్‌లో మొత్తంగా 33 పరుగులు వచ్చాయి. ఇక గెలుపు ఖాయం అనుకుంటున్న సమయంలో మరో సిక్సర్ కొట్టి రాయల్ కింగ్స్‌ను గెలిపించాడు రితిక్ ఈశ్వరన్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: