ఇక 2023 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ టీం అడుగుపెట్టడం జరిగింది. ఇక అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన క్వాలిఫియర్-2లో ఏకంగా 62 పరుగుల తేడాతో విజయం సాధించిన గుజరాత్ టీం వరుసగా రెండో సారి కూడా ఫైనల్కు చేరుకుంది. అందువల్ల గుజరాత్ టైటాన్స్ ఓ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకుంది.అదేంటంటే ఐపీఎల్లో తమ తొలి రెండు సీజన్లలో వరుసగా ఫైనల్కు చేరిన ఏకైక జట్టుగా గుజరాత్ చరిత్ర సృష్టించింది. గతేడాది కూడా క్వాలిఫియర్-1లో రాజస్తాన్ను ఓడించి ఫైనల్కు చేరిన గుజరాత్.. ఈ సారి మాత్రం క్వాలిఫియర్-2 ని ఆడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్..యంగ్ బ్యాట్స్ మెన్ శుబ్మన్ గిల్(129) సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 233 పరుగుల భారీ స్కోర్ ని సాధించింది.ఇక ఆ తరువాత లక్ష్య ఛేదనలో 171 పరుగులకే ముంబై టీం ఆలౌటైంది.
ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్(61) ఇంకా తిలక్ వర్మ(43) అద్భుత ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ.. తమ జట్టును మాత్రం గెలిపించుకోలేకపోయారు. ఇక గుజరాత్ టీం బౌలర్లలో మొహిత్ శర్మ మొత్తం 5 వికెట్లు పడగొట్టగా.. షమీ ఇంకా రషీద్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు.ఇంకా అదే విధంగా ఈ సంవత్సరం సీజన్లో ఫస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్-చెన్నై మధ్య జరిగిన సంగతి తెలిసిందే. అయితే యాదృచ్చకంగా ఆఖరి మ్యాచ్(ఫైనల్) కూడా ఈ రెండు టీమ్స్ మధ్యే జరగునుంది.అలాగే వేదిక కూడా ఒక్కటే కావడం గమానర్హం. ఇలా జరగడం 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్. ఇక అనగా రేపు మే28 వ తేదీన అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా గుజరాత్ టైటాన్స్ తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఇంకా ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి ఐదో సారి టైటిల్ను ముద్దడాలని సీఎస్కే భావిస్తుంటే.. గుజరాత్ టీం కూడా వరుసగా రెండో సారి ట్రోఫీని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది.