KKR vs RCB: ఆ ఇద్దరి ఆటగాళ్లకి చాలా ప్రత్యేకం?

Purushottham Vinay
ఇక ఐపీఎల్ 2023 తొమ్మిదో మ్యాచ్‌లో, ఈ రోజు (ఏప్రిల్ 6), కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంకా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు  పోటాపోటీగా తలపడనున్నాయి.కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్‌లో రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ అనేది జరగనుంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు పునరాగమనం చేయాలని భావిస్తోంది. రాయల్ చాలెంజర్స్ జట్టు తమ గెలుపు ప్రచారాన్ని కొనసాగించాలని కూడా కోరుకుంటోంది. కేకేఆర్ వెటరన్‌ ప్లేయర్ లు అయిన ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్‌లకు ఈ మ్యాచ్ అనేది చాలా ప్రత్యేకంగా నిలవనుంది.ఇంకా ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేయాలని ఇద్దరు ఆటగాళ్లు కూడా కోరుకుంటున్నారు.ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ అయిన సునీల్ నరైన్‌కి ఇది 150వ ఐపీఎల్ మ్యాచ్. అతను KKR కోసం అత్యధికంగా మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా IPL రికార్డుల్లో నిలిచాడు.ఇంకా ఈ ఐపీఎల్ చరిత్రను కనుక పరిశీలిస్తే, ఒకే ఒక్క ఫ్రాంచైజీ కోసం ఐపీఎల్‌లో ఆడిన ఆటగాళ్లలో సునీల్ నరైన్ ఒకరు. ఐపీఎల్‌ టోర్నమెంట్ లో ఇప్పటి దాకా మొత్తం 149 మ్యాచ్‌లు ఆడిన అతను ఏకంగా మొత్తం 153 వికెట్లు తీయడం జరిగింది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన వచ్చేసి మొత్తం 19 పరుగులకు 5 వికెట్లుగా నిలిచింది.



అతను KKR టీం కోసం అత్యంత ముఖ్యమైన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు.ఇంకా అంతేగాక బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా సునీల్ నరేన్‌ సత్తా చాటుతున్నాడు.ఇక ఆండ్రీ రస్సెల్ గురించి కనుక మాట్లాడితే, ఇది ఐపీఎల్‌లో అతనికి ఏకంగా 100వ మ్యాచ్. ఇంకా అలాగే KKR తరపున అత్యధిక IPL మ్యాచ్‌లు ఆడిన నాల్గవ ఆటగాడు ఆండ్రి రస్సెల్ నిలిచాడు. 2012 వ సంవత్సరం నుంచి ఐపీఎల్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడు. అతను 2014 వ సంవత్సరంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరడానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తరపున మొత్తం రెండు సీజన్లు ఆడాడు. ఆ సమయంలో అతను ఢిల్లీ తరపున మొత్తం 7 మ్యాచ్‌లు ఆడాడు. అలాగే కోల్‌కతా తరపున ఆండ్రి రస్సెల్ ఇప్పటి దాకా మొత్తం 92 మ్యాచ్‌లు ఆడాడు. అతను ఇప్పుడు చక్కటి ఆల్‌రౌండర్‌గా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లో ఆండ్రీ రస్సెల్ మొత్తం రెండు వేలకు పైగా పరుగులు చేశాడు. ఇంకా అలాగే దీంతో పాటు లీగ్‌లో మొత్తం 89 వికెట్లు కూడా తీశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: