భారత్లో వరల్డ్ కప్ జరగడం.. నిజంగా బాధాకరం?
అయితే కేవలం ఈ ఏడాది మాత్రమే కాదు గత కొన్నేళ్ల నుంచి కూడా వరల్డ్ కప్ భారత్లోనే నిర్వహిస్తూ వస్తున్నారు అని చెప్పాలి. ప్రస్తుత వరల్డ్ కప్ తో కలిపి ఇక దాదాపు మూడు వరల్డ్ కప్ లు వరుసగా భారత్ లోనే నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక ఇలా అన్ని వరల్డ్ కప్ లు కూడా భారత్ వేదికగానే నిర్వహించాల్సి వస్తున నేపథ్యంలో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ కప్ అంటే ఎప్పుడు ఒక్కో దేశంలో నిర్వహించాలి.. కానీ ఒక భారత్ వేదిక గానే నిర్వహించడం ఏంటి అని కొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు.
ఇక భారత్ వేదికగా వరుసగా హాకీ ప్రపంచకప్ జరగడం గురించి బెల్జియం ఆటగాడు ఎలియాట్ వాన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు అని చెప్పాలి. పదే పదే ప్రపంచక భారతలో జరగడం సరికాదు అంటూ వ్యాఖ్యానించాడు. గత నాలుగు ప్రపంచ కప్లలో కూడా మూడింటిని భారత్ వేదికగానే నిర్వహించారు. అలా ఎలా ఒకే దేశంలో ఎన్ని వరల్డ్ కప్ లు నిర్వహించడానికి అనుమతి ఇస్తారు అంటూ ప్రశ్నించాడు. డబ్బు వల్లే ఇది సాధ్యమైంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత్లో ఆదరణ ఉంటుంది కనుక ఇక్కడ ఆతిథ్యం ఇస్తున్నారని కానీ.. ఇది క్రీడా స్ఫూర్తిగా విరుద్ధం అంటూ వ్యాఖ్యానించాడు.