టీమిండియాతో టి20 సిరీస్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్?

praveen
ఆస్ట్రేలియా జట్టును గత కొంత కాలం నుంచి గాయాల బెడద వేధిస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడుతూ దూరం అవుతూ ఉండటం గట్టి ఎదురు దెబ్బ  అని చెప్పాలి. ఇటీవల స్వదేశంలో జింబాబ్వే తో రెండో వన్డేకు ముందు ఆస్ట్రేలియాలోని స్టార్ ఆల్రౌండర్ జట్టుకు దూరమయ్యాడు. మిచెల్ మార్స్ గాయం కారణంగా రెండో వన్డే కి దూరం కావడంతో ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి.   మరోవైపు వచ్చే నెలలో భారత్ తో  టి20 సిరీస్ జరగాల్సి ఉంది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఇక ఈ టి 20 సిరీస్ కు కూడా స్టార్  ఆల్రౌండర్ మార్ష్  గాయం నుంచి కోలుకునే అవకాశాలు లేవు అనేది తెలుస్తుంది.


 ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్  మార్ష్  చీలమండ గాయం తో బాధ పడుతున్నాడట. ఇటీవలే అతన్ని పరీక్షించిన వైద్యులు గాయం తీవ్రత ఇంకా ఎక్కువగానే ఉందని మరి కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ సూచించారట.  ఈ క్రమంలోనే అతను  లేకుండానే భారత్తో జరగబోయే టి20 సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టు బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతుంది అన్నది తెలుస్తుంది.  కాగా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్  స్థానంలో వికెట్ కీపర్ జోష్ ఇంగ్లీస్  ను  జట్టులోకి తీసుకుందట క్రికెట్ ఆస్ట్రేలియా.


  కాగా జింబాబ్వే ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్  టౌన్స్ విల్లే  వేదికగా జరగబోతోంది అన్న విషయం తెలిసిందే.  ఇక నేడే రెండో వన్డే మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  అయితే మొదటి వన్డే మ్యాచ్లోమార్ష్  గాయం బారినపడిన మిచెల్ మార్స్ పర్వాలేదనిపించాడు అన్న విషయం తెలిసిందే. 6 ఓవర్లు వేసిన ఈ ఆల్ రౌండర్ 22 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టారు. అయితే అటు బ్యాటింగ్లో మాత్రం నిరాశపరిచాడు అనే చెప్పాలి. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: