టీమిండియా విజయం.. ఇలా ఇదే తొలిసారి?

praveen
మొన్నటి వరకు కేవలం స్వదేశం లో మాత్రమే టీమిండియా కెప్టెన్సీ చేపట్టిన  రోహిత్ శర్మ విజయవంతమయ్యాడు. టీమిండియాకు వరుసగా విజయాలు అందించి తన కెప్టెన్సీకి తిరుగులేదు అని నిరూపించాడు. అయితే  ఇంగ్లండ్ గడ్డ పై రోహిత్ శర్మ కెప్టెన్సీ ఎలా ఉంటుందో చూడటానికి అందరూ ఆసక్తిగా ఎదురు చూడగా.. టి20 సిరీస్ లో భాగంnగా వరుసగా రెండు మ్యాచ్లలో టీమిండియాకు విజయాన్ని అందించి సిరీస్ను కూడా అందించాడు రోహిత్ శర్మ. ఈ క్రమం లోనే వన్డే సిరీస్లో ఇంగ్లండ్ జట్టు పుంజుకుంటుందని అందరూ అనుకున్నారు.


కాని రోహిత్ శర్మ తన కెప్టెన్సీ వ్యూహాల తో అందరి అంచనాలను మరో సారి తారుమారు చేసేశాడు. ఏకంగా టాస్ గెలిచి  మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. ఈ క్రమం లోనే భారత బౌలర్లు విజృంభించడం తో అటు ఇంగ్లాండ్ బ్యాటింగ్ విభాగం మొత్తం పేకమేడలా కూలి  పోయింది. ఈ క్రమం లోనే 111 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లాండ్ జట్టు చివరి ఆలౌట్ అయింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన టీమిండియా మరింత అదరగొట్టింది.


 రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఓపెనర్లుగా బరిలోకి దిగగా ఎంతో ఆడుతూపాడుతూ 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించారు. 18.4 ఓవర్లలో నే టార్గెట్ రీచ్ అయ్యారు. అయితే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా భారత జట్టు లక్ష్యాన్ని చేధించడం గమనార్హం. అయితే ఇంగ్లండ్ జట్టు పై ఇంత ఘన విజయం సాధించడం ఇదే మొదటి సారి. ఒక్క వికెట్ కోల్పోకుండా  ఇంగ్లాండ్ నిర్దేశించిన టార్గెట్ ను చేధించిన టీమిండియా అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి. కాగా రోహిత్ శర్మ 76 పరుగులతో రాణించాడు.శిఖర్ ధావన్ 31 పరుగులు చేశాడు. పది వికెట్ల తేడాతో భారత జట్టుకు విజయం వరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: