5వ టీ20లో.. టీమిండియా విజయం?

praveen
ప్రస్తుతం భారత ప్రేక్షకులందరిలో కూడా ఉత్కంఠ నెలకొంది. నేడు జరగబోయే ఐదవ టి20 మ్యాచ్ లో ఎవరు పైచేయి సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇప్పటివరకు జరిగిన నాలుగు టి20 మ్యాచ్ లలో ఇక సౌతాఫ్రికా టీమిండియా జట్లు బాగా రాణించాయి. తొలి రెండు మ్యాచ్ లలో సౌత్ఆఫ్రికా విజయం సాధిస్తే ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది టీమ్ ఇండియా జట్టు. తర్వాత రెండు మ్యాచ్లలో విజయం సాధించింది.. ఈ క్రమంలోనే ఐదవ మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా ప్రస్తుతం 2-2 తో సమంగా కొనసాగుతున్నాయ్ ఇరుజట్లు.

 దీంతో నేడు బెంగళూరు వేదికగా జరగబోయే ఐదవ టి20 మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తే వారికే సిరీస్ కైవసం కానుంది. ఈ క్రమంలోనే రెండు జట్ల బలాబలాలు కూడా సమంగా ఉన్న నేపథ్యంలో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇటీవలే 5వ టీ20 మ్యాచ్ పై ఎంతో మంది భారత మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ఎవరు ఇలాంటి ప్రదర్శన చేస్తారు అన్న విషయం పై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఇక అన్ని విషయాలపై తన విశ్లేషణలు చెబుతున్న మాజీ ఆటగాడు వసీం జాఫర్ 5వ టీ20 మ్యాచ్ గురించి కూడా స్పందించాడు.

 గత రెండు మ్యాచ్ లలో భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా 5వ 20 మ్యాచ్ లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. తొలి రెండు మ్యాచ్ లో గెలిచిన తర్వాత వరుసగా రెండు మ్యాచ్లలో సౌత్ఆఫ్రికా జట్టు ఓడిపోయింది. ఇలా వరుస ఓటములు అటు దక్షిణాఫ్రికా ఆటగాళ్ల మానసిక స్ధైర్యాన్ని దెబ్బతీస్తాయి అంటూ వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో వరుసగా రెండు విజయాలు సాధించిన టీమిండియా ఆత్మవిశ్వాసంతో ఉందని అందుకే 5వ టి20 మ్యాచ్ టీమిండియాదే విజయం అంటు వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: