ఆ ఇద్దరి వల్లే గెలిచాం : రిషబ్ పంత్

praveen
ఇటీవలే చావో రేవో తేల్చుకోవాల్సిన నాలుగో టి20 మ్యాచ్ లో రిషబ్ పంత్ సేనా ఎంత అద్భుతమైన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ ఆఫ్రికాకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా తక్కువ పరుగులకే కట్టడి చేసి భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే నాలుగో టి20 మ్యాచ్ లో విజయంపై రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. కీలక సమయంలో ఇద్దరు అద్భుతమైన సుదర్శన చేయడం కారణంగానే టీమిండియా విజయం సాధించింది అంటూ చెప్పుకొచ్చాడు. ఆ ఇద్దరూ ఎవరో కాదు హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ అన్న విషయం తెలిసిందే.

 ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేసి అద్భుతమైన ప్రతిభ కనబరిచటం పైనే హార్దిక్ పాండ్యా నేను మాట్లాడుకుంటూ ఉంటాము. అనుకున్న విధంగానే ప్రణాళిక అమలు చేయడంతో ఫలితం దక్కింది. ఇక కీలక సమయంలో హార్దిక్ ఎంతో అద్భుతమైన బ్యాటింగ్ చేయడం సంతోషించే విషయం అంటూ చెప్పుకొచ్చాడు. దినేష్ కార్తీక్ అయితే తన బ్యాటింగ్తో ప్రత్యర్థిని చంపేశాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక వ్యక్తిగతంగా నేను కొన్ని విషయాలు మెలగాల్సిన అవసరం ఉంది అని తెలిపాడు. ఇక హార్దిక్ పాండ్యా దినేష్ కార్తీక లు సరైన సమయంలో మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన కారణంగానే టీమిండియాకు స్కోర్ వచ్చింది అంటూ తెలిపాడు.

 అయితే టాస్ ఓడి బ్యాటింగ్కు దిగింది టీమిండియా. ఈ క్రమంలోనే 10 ఓవర్లలో 56 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో టీమిండియా కనీసం 120 పరుగులు అయినా చేస్తుందా లేదా అనే సందేహం అందరిలోనూ నెలకొంది. ఆ సమయంలోనే క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా విధ్వంసం సృష్టించారు. కేవలం చివరి ఐదో ఓవర్ లలోనే  73 పరుగులు రాబట్టారు. ఇద్దరు ఆటగాళ్ళు కూడా అర్థ సెంచరీలతో మెరిసారు అనే చెప్పాలి. ఇకపోతే 5వ టీ20 మ్యాచ్ ప్రస్తుతం ఫలితం తెల్చే మ్యాచ్ గా మారిపోయింది. ఆదివారం ఈ మ్యాచ్ బెంగళూరు వేదికగా జరగబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Win

సంబంధిత వార్తలు: