హమ్మయ్య.. కోహ్లీ రికార్డు పదిలంగానే ఉంది?
కేవలం 39 పరుగులు మాత్రమే చేసిన బట్లర్ హార్దిక్ పాండ్య బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఫైనల్ మ్యాచ్ లో కూడా జోస్ బట్లర్ మరో సెంచరీ చేసి అదర కొడతాడు అని అందరూ అనుకున్నారు. విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు కొడతాడు అని అందరూ భావించారు. కానీ 39 పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు. దీంతో విరాట్ కోహ్లీ రికార్డ్ పదిలంగానే ఉండిపోయింది. ఈ క్రమంలోనే మొత్తంగా 17 మ్యాచ్ లలో 863 పరుగులు చేసిన జాస్ బట్లర్.. 2016లో 848 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ రికార్డును బ్రేక్ చేశాడు అని చెప్పాలి. అయితే ఈ లిస్టులో టాప్ లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. 2016లో 973 పరుగులు చేశాడు.
ఇక ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ జట్టు టైటిల్ను ఎగరేసుకుపోయింది. దీంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది అనే చెప్పాలి. ఎన్నో గాయాలు సర్జరీలు ఉద్వాసన విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా ఎంతో అద్భుతంగా పుంజుకొని ఒక ఆటగాడిగా నిరూపించుకోవడమే కాదు జట్టు సారథిగా నిలదొక్కుకున్న తీరు మాత్రం ప్రతి ఒక్క క్రికెట్ ప్రేక్షకుడిని ఫిదా అయ్యేలా చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.