మైదానంలోకి వచ్చిన అభిమాని.. కోహ్లీ రియాక్షన్ వైరల్?

praveen
ఇటీవల ఐపీఎల్ లో భాగంగా ఎలిమినేటర్ మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లక్నో, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో బెంగుళూరు జట్టు విజయం సాధించి ముందుకు వెళ్ళింది. 14 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది. అయితే ఈ మ్యాచ్ ముగిసినప్పటికీ ఈ మ్యాచ్ కు సంబంధించిన ఏదో ఒక విషయం మాత్రం  సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తు హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఇలాంటి ఒక వీడియో  వైరల్ గా మారిపోయింది. ట్విట్టర్ లో తెగ ట్రెండ్ అవుతుంది.

 సాధారణంగా మ్యాచ్ సీరియస్ గా జరుగుతున్న సమయంలో తమ అభిమాన ఆటగాడిని కలిసేందుకు  మ్యాచ్ వీక్షిస్తున్న ప్రేక్షకులు సెక్యూరిటీని దాటుకుని మైదానంలోకి పరుగులు పెడుతూ రావడం జరుగుతుంటుంది. ఇలా మైదానంలోకి వచ్చిన అభిమానులను ఒకప్పుడు ఆటగాళ్లు దగ్గరికి తీసుకుని కలిసి పంపించేవారు. కానీ ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా అభిమానులు ఎవరిని కూడా దగ్గరకు రానివ్వడంలేదు. మొన్నటికి మొన్న రోహిత్ శర్మ అభిమాన ఇలాగే మైదానంలోకి వస్తే దూరం నుండే హాగ్ ఇస్తున్నట్లుగా చెప్పి పంపించాడు. ఇటీవల ఎలిమినేటర్ మ్యాచ్లో కూడా ఇలాగే జరిగింది. కోహ్లీ కోసం ఒక అభిమాని మైదానంలోకి పరుగెత్తుకు వచ్చాడు.

 లక్నో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతని వద్దకు ఒక అభిమాని పరుగెత్తుకు వచ్చాడు. అది చూసిన కోహ్లీ అతనికి దూరంగా వెళ్ళాడు. సెక్యూరిటీ పిలిచి ఆ వ్యక్తిని స్టేడియం  నుంచి తీసుకెళ్లాలని అరిచాడు. అక్కడికి వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది వడ్ల బస్తా ను భుజంపై ఎత్తుకొన్నట్లుగా అతని తీసుకెళ్లాడు. ఇది చూసి కోహ్లీ నవ్వుకున్నాడు. అభిమానుల వైపు తిరిగి డబ్ల్యూఈడబ్ల్యూఈ జాన్ సేనా తరహాలో అదిరిపోయే యాక్షన్ ఇచ్చాడు. దీనికి స్టేడియం లో ఉన్న  అభిమానులు నవ్వులు చిందించారు. ఈ వీడియో కర్త వైరల్ గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: