రాజస్థాన్ గెలవాలంటే గేమ్ ప్లాన్ మార్చాల్సిందే?
కానీ గుజరాత్ తో జరిగిన మొదటి క్వాలిఫైయర్ లో చిన్న చిన్న తప్పిదాలు చేసి ఓటమిని పొందిన రాజస్థాన్ ఈ సారి విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. అయితే ఈ సారి కూడా అదే పొరపాట్లు రిపీట్ చేస్తే చేతుల వరకు వచ్చిన ట్రోఫీని పోగొట్టుకున్నట్లే అవుతుంది. ఈ మ్యాచ్ లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు గేమ్ ప్లాన్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
* విజయం దక్కాలంటే ముందుగా శాంసన్ టాస్ గెలవాలి. అయితే టాస్ గెలవడం లేదా కోలోవడం ఎవరి చేతుల్లో ఉండదు కాబట్టి గెలవాలని కోరుకోగలము.
* ఫీల్డింగ్ వస్తే... బెంగుళూరును 180 పరుగుల లోపు కట్టడి చెయ్యాలి. అంతే కాకుండా బౌలింగ్ ను కూడా ఒక పద్ధతి ప్రకారం చేయించాలి. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ మరియు మెక్ కాయ్ ల ఖాతాను 15 వర్ల లోపే పూర్తి చేయించాలి. ఎందులకంటే స్పిన్ ను చివర్లో వేయించడం అంత మంచిది కాదు. ఇక మెక్ కాయ్ కూడా కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకోలేడు. అందుకే ఇతనికి ముందుగానే ఓవర్లను ఇచ్చేయాలి.
* ఒకవేళ ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వస్తే... బట్లర్ మరోసారి చెలరేగాల్సి ఉంది.. ఇక శాంసన్ కనీసం 15 ఓవర్ల వరకు అయినా నిలబడి జట్టుకు మంచి టార్గెట్ ను అందించాలి.
* ఇక కెప్టెన్ గా సంజు శాంసన్ చాలా పరిణతి చెందాల్సిన అవసరం ఉంది. కీలక సమయంలో ప్రసిద్ధ కృష్ణ తడబడుతున్నాడు. ఎప్పుడైనా చివరి ఓవర్లలో లెంగ్త్ యార్కర్ లు వేస్తే బ్యాట్స్మన్ ఖచ్చితంగా ఇబ్బంది పడుతాడు. ఈ లాజిక్ మిస్ అయి మొన్న గుజరాత్ తో ఓడింది.
* బెంగుళూరు జట్టులో మాక్స్ వెల్, దినేష్ కార్తీక్ లను కట్టడి చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. అలాగే బెంగళూర్ బౌలింగ్ లో హాజిల్ వుడ్ చాలా డేంజరస్... స్లోవర్ బంతులేసి వికెట్లను తీయడానికి ట్రై చేస్తాడు.