ప్రతీకారానికి సమయం వచ్చింది.. ఇండియా రెడీ?

praveen
ప్రస్తుతం న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్లో భారత జట్టు ఎంత అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్తో జరగగా ఏకంగా వందకుపైగా పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఇక ఆ తర్వాత ప్రత్యర్థి జట్లపై పూర్తి ఆధిపత్యాన్ని సాధిస్తూ ఘన విజయాలతో పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని అంతకంతకు మెరుగు పరుచుకుంటూ దూసుకు పోతుంది అని చెప్పాలి. ఇలా ప్రస్తుతం మహిళల వన్డే వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న టీమిండియాకు ఇక ఇప్పుడు దాదాపు ఐదేళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చేసింది.


 సరిగ్గా ఐదేళ్ల క్రితం  అద్భుతమైన ఆట తీరుతో వన్డే వరల్డ్ కప్ ఫైనల్కు చేరింది టీమిండియా మహిళల జట్టు. ఇక టైటిల్ పోరులో ప్రత్యర్థి ఇంగ్లాండ్ టీమిండియాపై విజయాన్ని అందుకుంది. ఇక చివరి వరకు పోరాడిన మిథాలీ సేన కేవలం 9 పరుగుల తేడాతో ఓటమిపాలై రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక నాటి మ్యాచ్ తర్వాత ఇప్పుడు మరోసారి వరల్డ్ కప్ లో ఇరు జట్లు ముఖాముఖీగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. దీంతో ఐదేళ్ల నాటి ప్రతీకారాన్ని టీమిండియాకు ఇప్పుడు తీర్చుకునే అవకాశం వచ్చింది. ఈ క్రమంలోనే ఇక ఎవరిది ఆధిపత్యం సాగిపోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.


 అయితే ఇప్పటివరకూ వరల్డ్ కప్ లో జరిగిన మ్యాచులలో చూస్తే ఇంగ్లాండ్ కంటే భారత జట్టు ఫామ్ మెరుగ్గా ఉంది అని చెప్పాలి. ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు చేతిలో ఓడినప్పటికీ పాకిస్తాన్ వెస్టిండీస్ లపై సాధించిన విజయాలు మాత్రం జట్టు ఎంత పటిష్ట స్థితిలో ఉందో చెప్పకనే చెబుతున్నాయి. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్ ఇప్పటివరకు వరల్డ్ కప్ లో ఖాతా తెరువ లేక పోయింది. ఆడిన మూడు మ్యాచ్ లలో కూడా ఓడిపోయింది.. దీంతో ఇక ఈ సారి టీమిండియా మహిళల జట్టు ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించడం అనే ఖాయం అని ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. ఇటీవలే టీమిండియా బ్యాటర్లు స్మృతి మందన, హర్మన్ ప్రీత్ కౌర్ లు మంచి ఫాంలోకి వచ్చ సెంచరీ చేయడంతో ఇక టీమిండియా మహిళల జట్టుకు తిరుగులేదు అని అంటున్నారు టీమిండియా అభిమానులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: