వావ్.. కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్లో రికార్డుల రారాజుగా కొనసాగుతున్నాడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ తన కెరీర్లో ఇప్పటి వరకు ఎన్నో అరుదైన రికార్డును సాధించింది ప్రపంచ వ్యాప్తంగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు. అందుకే కేవలం భారత్లోనే కాదు ఇతర దేశాల్లో సైతం ప్రేక్షకులు కోహ్లీని అమితం  గా  అభిమానిస్తూ ఉంటారు. క్రికెట్ లో ఎంతమంది దిగ్గజాలు సాధించిన రికార్డులను ఎంతో అలవోకగా ఛేదించి తనకు తిరుగు లేదు అని నిరూపించుకున్నాడు విరాట్ కోహ్లీ.



 ఇక విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులను చేదించడం అంటే దాదాపు ఎంతో కష్టం అని చెప్పాలి. అలాంటిది ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతం గా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ మాత్రం కోహ్లీ రికార్డును బద్దలు కొట్టేశాడు. గత కొంత కాలం నుంచి వరుసగా టీమిండియా లో ఛాన్స్ దక్కించుకుంటున్న శ్రేయస్ అయ్యర్ వచ్చిన ప్రతి అవకాశాన్ని  కూడా బాగా ఉపయోగించుకుంటున్నాడు. ప్రతి మ్యాచ్ లో కూడా కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతూ భారత జట్టు లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇటీవలే శ్రీలంక తో జరిగిన టి20  సిరీస్లో కూడా  ఎంతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అన్న విషయం తెలిసిందే.


 ఇలా శ్రీలంక తో జరిగిన టెస్టు సిరీస్లో అదర గొట్టిన శ్రేయస్ అయ్యర్.. టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టేశాడు. 2016 లో ఆస్ట్రేలియా జట్టు పై విరాట్ కోహ్లీ ఒక సిరీస్లో 199 పరుగులు చేశాడు. ఇలా ఇప్పటి వరకు ఒక సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. ఇక ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్లో శ్రేయస్ అయ్యర్ మూడు మ్యాచ్ల్లో కలిపి 204 పరుగులు చేసి విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టేశాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: