పాపం.. టీమిండియాలో చోటు దక్కింది.. కానీ దురదృష్టం?

praveen
ఇటీవల దేశవాళీ క్రికెట్లో తన అద్భుతమైన ప్రదర్శనతో భారత సెలెక్టర్లు జట్టును ఆకర్షించిన రుతురాజ్ గైక్వాడ్ ఇప్పుడు శ్రీలంకతో జరుగుతున్న టి20 సిరీస్ లో ఎంపికయ్యాడు అన్న విషయం తెలిసిదే. ఇక ఈ టి 20 సిరీస్ లో కూడా అద్భుతంగా రాణించి భారత్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం ఖాయం అని అభిమానులు అందరూ అనుకున్నారు.  కానీ ఈ యువ ఆటగాడికి దురదృష్టం వెంటాడింది అని తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్కు ఎంపిక అయినా రూతురాజ్ మణికట్టు గాయంతో మిగతా మ్యాచ్లు అన్నింటికీ కూడా దూరమయ్యాడు. ఇప్పటికే మొదటి టి20 మ్యాచ్ లో కేవలం బెంచ్ కు మాత్రమే పరిమితమైన ఈ యువ ఆటగాడు రెండో టీ20 మ్యాచ్లో చోటు దక్కించుకున్నాడు.



 కానీ రుతురాజ్ ను మాత్రం దురదృష్టం వెంటాడింది. తన కుడిచేతి మణికట్టు గాయం తిరగబెట్టింది.  బ్యాటింగ్ ప్రాక్టీస్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కున్నాడు అన్నది తెలుస్తోంది. ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షణలో ఉన్నాడట రూతురాజ్.  గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో మిగతా మ్యాచ్ లకు దూరంగా ఉంటాడు  అన్నది తెలుస్తుంది. అయితే రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో మయాంక్ అగర్వాల్ జట్టులోకి రాబోతున్నాడు. ఇప్పటికే మయాంక్ అగర్వాల్ జట్టుతో జాయిన్ అయ్యాడట. అయితే మయాంక్ అగర్వాల్ టీమిండియాలో ఎంపిక అయినప్పటికీ బయో బబుల్ లో ఉంటాడని బీసీసీఐ తెలిపింది. అయితే రుతు రాజ్ వెస్టిండీస్ తో ముగిసిన సిరీస్ లో ఆఖరి మ్యాచ్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.


 అయితే టీమిండియాకు ఇప్పటికే కె.ఎల్.రాహుల్,అక్షర్ పటేల్, దీపక్ చాహర్, సూర్యకుమార్ యాదవ్ లాంటి కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. ఇప్పుడు రుతురాజ్ కూడా గాయం బారినపడి దూరమయ్యాడు. ఇలా వరుసగా ఆటగాళ్లు గాయాల బారినపడి దూరమవ్వడం మాత్రం అటు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ అని చెప్పాలి. తొలి టీ-20 మ్యాచ్లో 62 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా ఇక నేడు రెండో టి20 మ్యాచ్ ఆడబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: