ఏంటీ.. రోహిత్ కాదు.. టెస్ట్ కెప్టెన్ గా అతనా?
అయితే ఇక విరాట్ కోహ్లీ కేవలం టెస్టు కెప్టెన్గా మాత్రమే కొనసాగుతాడని ప్రేక్షకులు అందరూ భావించారు. అయితే ఇటీవల సౌత్ పర్యటనలో భాగంగా ఇక విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆడిన టీమిండియా ఓటమి పాలయింది. ఇక సిరీస్ను ఓడిపోయిన 24 గంటల్లోనే తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న అంటూ విరాట్ కోహ్లీ ప్రకటించడం సంచలనంగా మారిపోయింది. దీంతో ఇప్పటికే పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఇక మరికొన్ని రోజుల్లో టెస్టు కెప్టెన్గా కూడా అవతరించ పోతున్నాడు అని అందరూ అనుకుంటున్నారు.
ఏకంగా మూడు ఫార్మాట్లలో రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో ముందుకు నడిపించపోతున్నాడు అని అనుకుంటున్న సమయంలో గతంలో బిసిసిఐ చెప్పిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయాయ్. పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి ఒక కెప్టెన్ టెస్ట్ ఫార్మాట్ కి ఒక కెప్టెన్ ఉంటే బాగుంటుంది అంటూ బిసిసీఐ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ద టెస్ట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న నేపథ్యంలో రోహిత్ శర్మకు కాకుండా కేఎల్ రాహుల్ కు టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. రోహిత్ శర్మ లాంటి సీనియర్ ని వదిలేసి కె.ఎల్.రాహుల్ కు కెప్టెన్సీ అప్పగించడం ఏంటి అని కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత తెలియనుంది.