మొన్నే వచ్చాడు.. అంతలోనే మయాంక్ అరుదైన ఘనత?
ఇక ఇటీవలే టెస్ట్ ఫార్మాట్ లో అయితే మయాంక్ అగర్వాల్ భారీగా పరుగులు చేస్తూ సత్తా చాటుతూ ఉండటం గమనార్హం. టి20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకునీ టీమిండియా విజయం సాధించడంలో మయాంక్ అగర్వాల్ కీలకపాత్ర వహించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా టెస్ట్ ఫార్మాట్ లో అద్భుతంగా రాణించిన మయాంక్ అగర్వాల్ కు ఇక ఇప్పుడు అరుదైన గౌరవం దక్కబోతోంది అన్నది అర్ధమవుతుంది. ఐసీసీ ప్రకటించిన అవార్డులను దక్కించుకోవాలని ప్రతి ఆటగాడు భావిస్తూ ఉంటాడు. అయితే ఇది మయాంక్ అగర్వాల్ కి కొన్ని రోజుల్లోనే సాధ్యం అయింది అని చెప్పాలి.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో భారత యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్ నిలిచాడు. డిసెంబర్ నెలలో అవార్డు కోసం ఐసిసి కుదించిన జాబితాలో మయాంక్ తోపాటు పాకిస్థాన్ ఆటగాడు అజాజ్ పటేల్, మిచెల్ స్టార్క్ లు కూడా స్థానం దక్కించుకోవడం గమనార్హం. ఇక మయాంక్ అగర్వాల్ రెండు మ్యాచుల్లో 69 సగటుతో 276 పరుగులు చేశాడు. ఇక సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగిన వరుసగా రెండు ఇన్నింగ్స్ లో 150,, 62 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా అవార్డు దక్కించుకున్నాడు మాయంక్ అగర్వాల్. ఇటీవలే సెంచురియాన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో కూడా టీమిండియా విజయంలో తన పాత్ర వహించాడు. 62 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.