ఓరి నాయనో.. కోహ్లీ ఒక్క పోస్టుకి అన్ని కోట్లా?

praveen
సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఎంతో మంది సెలబ్రిటీలు వారి అభిమానులు అందరితో కూడా నేరుగా చేరువయ్యేందుకు అవకాశం లభించింది. ఈ ఈ క్రమంలోనే   ప్రస్తుతం ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికగా తమకు సంబంధించిన అప్డేట్ అన్నింటినీ కూడా అభిమానులకు పోస్ట్ చేస్తూ ఉన్నారు సెలబ్రిటీలు. సెలబ్రిటీల దగ్గరనుంచి క్రీడాకారుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇలా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరవుతున్నారు. ఇక అదే సమయంలో సోషల్ మీడియాలో ఎన్నో యాడ్స్ ప్రమోషన్స్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్న క్రీడాకారులు కూడా చాలామంది ఉన్నారు.

 ఇలా ఒక్కొక్క పోస్టుకి ఏకంగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వారిలో భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. సోషల్ మీడియా ద్వారా వివిధ పోస్టుల తో అత్యధికంగా సంపాదించిన క్రీడాకారులలో గత ఏడాది టాప్ 20లో విరాట్ కోహ్లీ చోటు దక్కించుకున్నాడు. అయితే ఇక ఈ జాబితాలో టాప్ 20 లో కేవలం విరాట్ కోహ్లీకి మాత్రమే చోటు దక్కడం గమనార్హం. కాగా టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కొక్క పోస్టుకి ఆరు లక్షల 80 వేల డాలర్లను అనుకుంటున్నాడట. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 5.08 కోట్లు ఒక పోస్టు అందుకుంటున్నాడు విరాట్ కోహ్లీ..

 కాగా విరాట్ కోహ్లీకి ఇప్పటివరకు ఇంస్టాగ్రామ్ లో 177 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక చివరి సారిగా తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కలిసి దిగిన ఒక ఫోటోని ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు విరాట్ కోహ్లీ. జనవరి 11వ తేదీన విరాట్ కోహ్లీ కూతురు పుట్టినరోజు ఉన్న నేపథ్యంలో వామిక ఫోటో రివీల్ చేయబోతున్నాడు అని అభిమానులు అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా అటు ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో సోషల్ మీడియాలో ఎక్కువగా సంపాదిస్తున్న వారిలో నెంబర్వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. క్రిస్టియానో రోనాల్డో కి 387 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఒక్క పోస్ట్ కి 1,604,000 అమెరికన్ డాలర్లు ఇస్తాడట క్రిస్టియన్ రోనాల్డో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: