తుది జట్టులో యంగ్ డైనమైట్... ఇక మెరుపులేనా?

VAMSI
ఈ రోజు ఇండియా మరియు న్యూజిలాండ్ ల మధ్య 3 మ్యాచ్ ల టీ 20 సిరీస్ ఇంకాసేపట్లో మొదలు కానుంది. ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడే అందిన పిచ్ రిపోర్ట్ ప్రకారం పచ్చని గడ్డితో ఉండడం వలన బాల్ చక్కగా బ్యాట్ మీదకు వస్తుందని అజిత్ అగార్కర్ తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సిరీస్ కు ఎంపికయిన యువ ఆటగాళ్లపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే స్క్వాడ్ లో సీనియర్ ప్లేయర్ ల నుండి పోటీ ఉండడంతో అవకాశం దక్కుంతుందా అనుకున్నారు. కానీ టీం ఇండియా కొత్త కోచ్ గా ఎంపికయిన మాజీ క్రికెటర్ గ్రేట్ వాల్ అఫ్ ఇండియా రాహుల్ ద్రావిడ్ మొదటి మ్యాచ్ లోనే తన ప్రణాళికను స్టార్ట్ చేశాడు.

తాను ఆడిన మొదటి ఐపీఎల్ సీజన్ లోనే అద్భుతమైన ఆటతీరును కనబరిచిన వెంకటేష్ అయ్యర్ ను ద్రావిడ్ మొదటి మ్యాచ్ లోనే తుది జట్టులో అవకాశం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంతకు ముందే వెంకటేష్ అయ్యర్ కు రాహుల్ ద్రావిడ్ డెబ్యూ క్యాప్ ను అందించాడు. దీనితో అందరికీ వెంకటేష్ అయ్యర్ పై అంచనాలు ఎక్కువయ్యాయి. ఐపీఎల్ ఆడినంత ఈజీగా అంతర్జాతీయ స్థాయిలో ఉండదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఏ విధంగా రాణిస్తాడు అన్న విషయం అంతా చర్చించుకుంటున్నారు.

మొదట కొన్ని బంతులు ఆచి తూచి ఆడితే పిచ్ స్వభావం అర్ధమవుతుంది. అప్పుడు తన సహజమైన ఆటతీరును కొనసాగించవచ్చు. మరి ఐపీఎల్ లాగే ఇక్కడ కూడా మెరుపులు మెరిపిస్తాడా లేదా అన్నది తెలియాలంటే సెకండ్ ఇన్నింగ్స్ వరకు వేచి చూడాలి. ఎందుకంటే టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ తీసుకున్నాడు. అయితే పిచ్ ప్రకారం ఇక్కడ చేజింగ్ చేసే జట్లకు మంచి రికార్డు ఉంది. మరి చివరికి ఫలితం ఎలా ఉండనుంది అన్నది తెలియాల్సి ఉంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: