పాక్ జర్నలిస్ట్ ప్రశ్నకు.. కోహ్లీ షాకింగ్ సమాధానం?

praveen
నిన్న భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన హై వోల్టేజీ మ్యాచ్ లో చివరికి భారత్ చిత్తుగా ఓడిపోయింది.  ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత్ ప్రదర్శనతో నిరాశపరిచింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ జట్టు బౌలింగ్ విభాగం బ్యాటింగ్ విభాగం అద్భుతంగా రాణించింది అనే చెప్పాలి. దీంతో చరిత్రను తిరగ రాస్తూ టీమిండియాపై అద్భుత విజయాన్ని సాధించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా టీమిండియా జట్టు పై పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని సాధించింది పాకిస్థాన్ జట్టు. అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పాకిస్తాన్ జట్టు భారత్ పై విజయం సాధించలేదు అన్న విషయం తెలిసిందే.  ఈసారి కూడా భారత దూకుడు చూస్తే పాకిస్తాన్ కి ఓటమి ఖాయం అని అనుకున్నారు ప్రేక్షకులు. కానీ ఊహించని విధంగా బౌలింగ్,బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాలలో కూడా పాకిస్థాన్ జట్టు అద్భుతంగా రాణించింది.

 ఈ క్రమంలోనే పాకిస్తాన్ బౌలర్ల ధాటికి పరుగులు చేయడానికి  టీమిండియా బ్యాట్స్మెన్లు  ఇబ్బంది పడితే.. అటు పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు   మాత్రం టీమిండియా బౌలర్లతో ఒక ఆట ఆడుకున్నారు. అయితే పాకిస్థాన్ జట్టు చరిత్ర తిరగరాస్తూ అద్భుతమైన విజయాన్ని సాధించడం మాత్రం అటు భారత ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇలాంటి ఒక ఓటమి తర్వాత ఇక కెప్టెన్గా  ఉన్నవారికి చిత్రవిచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్ జట్టుతో ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ మీడియా ముందుకు వచ్చాడు. ఈ క్రమంలోనే కొంతమంది చిత్రవిచిత్రమైన ప్రశ్నలు అడిగారు. విరాట్ కోహ్లీ కూడా షాకింగ్ సమాధానాలు ఇచ్చాడు.

 పాకిస్తాన్తో ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ మాట్లాడుతున్న సమయంలో పాకిస్థాన్కు చెందిన రిపోర్టర్ కోహ్లీని ఒక ప్రశ్న అడిగాడు. ఈ ప్రశ్నకు కి ఒక్క సారిగా షాక్ అయ్యాడు కోహ్లీ. నెట్ ప్రాక్టీస్లో ఇషాన్ కిషన్ బాగా ఆడాడు కదా.. మరి అలాంటప్పుడు మీరు రోహిత్ ప్లేస్ లో ఎందుకు ఇషాన్ కిషన్ ను తీసుకోవాలని ఆలోచించలేదు.. అటు పాకిస్తాన్ రిపోర్టర్ ప్రశ్నించాడు. ప్రశ్నకు  ఒక్కసారిగా షాక్ అయిన కోహ్లీ.. టి20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ను పక్కన పెట్టడం ఏంటి.. మీరు అలా అనుకుంటున్నారా అంటూ షాకింగ్ సమాధానం ఇచ్చాడు. మేము బెస్ట్ టీం తోనే బరిలోకి దిగాము.. మీరు కాంట్రవర్సీ ప్రశ్నలు అడగండి అంటూ సమాధానం ఇచ్చాడు విరాట్ కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: