పాక్ జర్నలిస్ట్ ప్రశ్నకు.. కోహ్లీ షాకింగ్ సమాధానం?
ఈ క్రమంలోనే పాకిస్తాన్ బౌలర్ల ధాటికి పరుగులు చేయడానికి టీమిండియా బ్యాట్స్మెన్లు ఇబ్బంది పడితే.. అటు పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు మాత్రం టీమిండియా బౌలర్లతో ఒక ఆట ఆడుకున్నారు. అయితే పాకిస్థాన్ జట్టు చరిత్ర తిరగరాస్తూ అద్భుతమైన విజయాన్ని సాధించడం మాత్రం అటు భారత ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి ఒక ఓటమి తర్వాత ఇక కెప్టెన్గా ఉన్నవారికి చిత్రవిచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్ జట్టుతో ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ మీడియా ముందుకు వచ్చాడు. ఈ క్రమంలోనే కొంతమంది చిత్రవిచిత్రమైన ప్రశ్నలు అడిగారు. విరాట్ కోహ్లీ కూడా షాకింగ్ సమాధానాలు ఇచ్చాడు.
పాకిస్తాన్తో ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ మాట్లాడుతున్న సమయంలో పాకిస్థాన్కు చెందిన రిపోర్టర్ కోహ్లీని ఒక ప్రశ్న అడిగాడు. ఈ ప్రశ్నకు కి ఒక్క సారిగా షాక్ అయ్యాడు కోహ్లీ. నెట్ ప్రాక్టీస్లో ఇషాన్ కిషన్ బాగా ఆడాడు కదా.. మరి అలాంటప్పుడు మీరు రోహిత్ ప్లేస్ లో ఎందుకు ఇషాన్ కిషన్ ను తీసుకోవాలని ఆలోచించలేదు.. అటు పాకిస్తాన్ రిపోర్టర్ ప్రశ్నించాడు. ప్రశ్నకు ఒక్కసారిగా షాక్ అయిన కోహ్లీ.. టి20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ను పక్కన పెట్టడం ఏంటి.. మీరు అలా అనుకుంటున్నారా అంటూ షాకింగ్ సమాధానం ఇచ్చాడు. మేము బెస్ట్ టీం తోనే బరిలోకి దిగాము.. మీరు కాంట్రవర్సీ ప్రశ్నలు అడగండి అంటూ సమాధానం ఇచ్చాడు విరాట్ కోహ్లీ.