వారెవ్వా.. ఐపీఎల్ లో మెరిసిన తెలుగోడు?

praveen
ఐపీఎల్ ద్వారా సత్తా చాటి ఎంతో మంది యువ ఆటగాళ్లు అటు భారత జట్టులో స్థానం సంపాదించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.  ఇప్పటి వరకు ఎంతో మంది ఆటగాళ్లు ఇలా ఐపీఎల్ లో బాగా రాణించి టీమిండియా జట్టులో కి చేరుకున్నారు. అయితే ఒకప్పుడు తెలుగు ఆటగాళ్లు చాలా తక్కువగా ఇలా ఐపీఎల్ లో స్థానం దక్కించుకునేవారు..  టీమిండియాలో చోటు దక్కించుకోవడం చేసేవారు.  కానీ గత కొంత కాలం నుంచి ఐపీఎల్ పుణ్యమా అని ఎంతోమంది తెలుగు ఆటగాళ్లు తమ ప్రతిభతో తెర మీదికి వస్తున్నారు. అద్భుతమైన ప్రతిభను చాటి చివరికి టీమిండియాలో స్థానాన్ని దక్కించుకున్నారు.


 ప్రస్తుతం టీమిండియా జట్టు లో అద్భుతంగా రాణిస్తున్న మహమ్మద్ సిరాజ్ సైతం ఇలా ఐపీఎల్లో అద్భుతంగా రాణించి ఏకంగా అంతర్జాతీయ భారత జట్టులో కూడా స్థానం సంపాదించుకున్నాడు.  ఇక ఇటీవల ఐపీఎల్ లో మరో తెలుగోడు మెరిశాడు. తెలుగు ప్రజలందరి గౌరవాన్ని నిలబెట్టాడు. ఇటీవలె రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఎంతో హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో చివరి బంతి వరకు కూడా ఎవరు గెలుస్తారు అన్నది ప్రేక్షకులకు ఉత్కంఠ గానే మారిపోయింది.



 అయితే ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో తెలుగు ఆటగాడు మెరిసాడు.  ఎంతో ఉత్కంఠ పోరులో ఒత్తిడిని జయించి అద్భుతంగా రాణించి సూపర్ స్టార్ గా మారిపోయాడు. తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్ ఏకంగా 52 బంతుల్లో 78 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.  చివరికి మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆఖరి బంతికి 5 పరుగులు చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ క్రమంలోని ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా చివరి బంతికి సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: