ఐపీఎల్ చూడాలంటే ఇది తప్పనిసరి.. గుర్తుపెట్టుకోండి?
అయితే మొన్నటి వరకు ఐపీఎల్ చూసేందుకు అనుమతి లేకపోవడంతో అభిమానులు అందరూ ఎంతో నిరాశ చెందారు. కానీ ఇప్పుడు ఐపీఎల్ చూసేందుకు ప్రేక్షకులందరినీ అనుమతించడంతో మురిసిపోతున్నారు. ఇక ప్రస్తుతం భారత్లో కాకుండా యూఏఈ వేదికగా జరుగుతూ ఉండటంతో కొంత మంది భారత అభిమానుల వెనకడుగు వేస్తుండగా.. కొద్దిమంది మాత్రం యూఏఈ వెళ్లి ఐపీఎల్ వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో అటు కరోనా వైరస్ ని దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ మ్యాచ్ లకు అభిమానులను అనుమతించడం పై యూఏఈ స్టేడియం యాజమాన్యాలు భిన్నమైన రూల్స్ తెరమీదకు తీసుకు వచ్చాయి.
సాధారణంగా మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు చేసుకున్న రిపోర్ట్ తప్పనిసరి అంటూ నిబంధనలు పెట్టడం చూశాము.. కానీ ఇటీవలే యూఏఈ లో స్టేడియం యాజమాన్యాలు మాత్రం ఆర్ టి పి సి ఆర్ రిపోర్ట్ అవసరం లేదు అంటూ తెలిపింది. అయితే టీకా వేసుకున్నట్లు సర్టిఫికేట్ మాత్రం తప్పనిసరి అంటూ స్పష్టం చేస్తోంది. దుబాయ్ స్టేడియం ఈ రూల్స్ పెట్టగా.. అటు షార్జా స్టేడియం మాత్రం ఆర్ టి పి సి ఆర్ రిపోర్టు తో పాటు టీకా వేసుకున్న సర్టిఫికెట్ కూడా కావాలి అంటూ నిబంధన పెట్టింది. అంతే కాకుండా 16 ఏళ్ల పైబడిన వారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఇస్తాము అంటూ తెలిపింది. అటు అబుదాబి స్టేడియం నిర్వాహకులు కూడా ఇలాంటి రూల్సు పెట్టడం గమనార్హం.