ఏడేళ్ల తర్వాత తొలి వికెట్ పడగొట్టాడు.. అభిమానులు ఫుల్ హ్యాపీ..?
ఐపీఎల్ జరుగుతున్న సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ కి శ్రీశాంత్ పాల్పడినట్లు ఆరోపణలు రావడం విచారణలో ఇది నిరూపణ కావడంతో.. బీసీసీఐ శ్రీశాంత్ పై తీవ్రంగా స్పందిస్తూ చర్యలు తీసుకుంది. శ్రీశాంత్ పై జీవిత కాలం నిషేధం విధించగా శ్రీశాంత్ న్యాయ పోరాటం చేయడంతో ఏడేళ్ళ పాటు నిషేధం విధిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. శ్రీశాంత్ తన 7 ఏళ్ల నిషేధం పూర్తి చేసుకుని మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టాడు అన్న విషయం తెలిసిందే. మరోసారి భారత జట్టులో స్థానం సంపాదించడమే లక్ష్యంగా ప్రస్తుతం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కేరళ జట్టు తరపున ఆడేందుకు శ్రీశాంత్ కి అవకాశం వచ్చింది. దీంతో మూడేళ్ల నిషేధం తర్వాత మొదటిసారి శ్రీశాంత్ క్రికెట్ మైదానంలోకి దిగాడు. ఇటీవల సోమవారం కేరళ జట్టు తరఫున బరిలోకి దిగిన శ్రీశాంత్.. ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో 7 ఏళ్ల నిషేధం తర్వాత మొదటి వికెట్ పడగొట్టి మైదానంలో భావోద్వేగానికి గురయ్యారు శ్రీశాంత్. ఇకపోతే ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో తన సత్తా చాటి మళ్ళీ బీసీసీఐ సెలక్టర్ల చూపును ఆకర్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు ఒకానొక సమయంలో శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.