గుడిలో గడపను ఎందుకు తొక్కకూడదో తెలుసా..?
ప్రతి ఒక్కరు కూడా ఆలయంలోకి ఎంట్రీ ఇచ్చేముందు గడపను నమస్కరిస్తూ ఉంటారు. అయితే ఇది ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం అని చెప్పవచ్చు. అయితే దీని వెనుక పెద్ద కథ ఉందని కూడా చెప్పవచ్చు.. ఇక అసలు విషయంలోకి వెళితే భద్రుడు అనే రుషి భద్రం అనే పర్వతం పిలువబడుతూనే.. హిమవంతుడు అనే భక్తుడు హిమాలయంగా.. నారాయణ అనే భక్తుడు నారాయణద్రిగా అవతరించినట్లుగా మన పురాణాలు సైతం తెలియజేస్తున్నాయి అయితే భగవంతుడి తమ భక్తుల కోసం కొండలపై వెలసినట్లుగా కూడా పురాణాలలో ఉన్నది.. ఆ కొండల నుంచి పడిన రాళ్లనే ఆలయానికి గడపలుగా ఉంచుతారని పురాణాలలో తెలియజేయడం జరుగుతోంది.
అందుచేతనే నిత్యం దేవుడిని దర్శించుకునేటప్పుడు గడపకు దక్షిణ పుణ్యానికి దాటుకొని వెళ్లేందుకు క్షమించమని అడగడమే ఈ గడపకు నమస్కరించడం వెనుక అర్థం ఉన్నట్లు పలువురు పండితులు సైతం తెలియజేస్తున్నారు. అందుచేతనే ఆలయంలోకి వెళ్లే ముందు గడపను తొక్కి వెళ్లకుండా కేవలం దాటుకొని మాత్రమే వెళుతూ ఉంటారని చెప్పవచ్చు.. ఇంకా చెప్పాలి అంటే దేవాలయంలోకి వెళ్లే ముందు ఓ దేవా నేను నీ సన్నిధిలోకి అడుగుపెట్టబోతున్నానని దేవుడు అనుమతి కోరడమే గడపకు మొక్కుతారని కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా కొన్ని గడపలకు సైతం భగవంతుడి పాదాలను కూడా ముద్రించడం జరుగుతుంది అందుకోసమే భగవంతుడి పాదాలను తాకి తనను చూడడానికి వెళ్లవచ్చు.