సాయి బాబాను ఇలా పూజిస్తే మీ కోరికలు తీరుతాయట !

VAMSI
పిలిస్తే పలికే దైవం సాయి బాబా. బాబా భక్తులు నమ్మకంతో సాయి ని పూజిస్తే చాలు సాయి తన భక్తుల కోర్కెలను తీర్చి కష్టాలను దూరం చేస్తారు. బాబా భక్తులకు గురువారం అనేది చాలా ప్రత్యేకమైన రోజు. ఒక్కో దేవుడికి ఒక్కో వారం ప్రత్యేకమైనదిగా ఉంటుంది. అలాగే సాయి బాబాకు గురువారం చాలా ఇష్టమైన రోజుగా ప్రతీతి. అందుకనే సాయి భక్తులు గురువారం రోజు న మిగిలిన రోజులకంటే భిన్నంగా ప్రత్యేకంగా బాబాకు పూజలు చేస్తుంటారు. అయితే గురువారం రోజు కనుక ఇలా కొన్ని నియమాలు పాటిస్తూ సాయిని పూజిస్తే ఇంకా గొప్ప ఫలితం దక్కుతుందట. అది ఎలాగో ఆ పూజ విధానం ఎలాగో ఇపుడు చూద్దాం.
గురువారం రోజున సాయిబాబా విగ్రహం కు ఆవు పాలతో పాలాభిషేకం చేయాలి. అంతే కాకుండా బాబాకు ఎంతో ఇష్టమైన ప్రసాదాలలో చపాతీ, పాల కోవ, కేసరి వంటి నైవేద్యాలను బాబాకు నైవేద్యం గా పెట్టాలి.  బాబాను పన్నీరు రోజాలతో నిండుగా అలకరించాలి. ప్రత్యేకించి ప్రార్థించడమే కాకుండా, పూజ అయిన తర్వాత చిన్న పిల్లలను పిలిచి ప్రసాదాన్ని అందించాలి. పిల్లలకు బాబా ప్రసాదాన్ని అందిస్తే నేరుగా బాబాకి నైవేద్యం అందించినట్లే అవుతుంది. బాబాకు చిన్నారులు అంటే చాలా ఇష్టమట, అందుకే పిల్లలతో కాసేపు సంతోషంగా గడపాలి. చిన్నారులకు బాబా ప్రసాదాన్ని అందించడం ద్వారా మంచి ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్న మాట.
అలాగే గురువారం రోజున యాచకులకు అన్నదానం చేయడం చాలా చాలా ఉత్తమం. ఎందుకంటే బాబా వారి రూపం లో మన కష్ట, నష్టాలను తీసుకుని మనల్ని అనుగ్రహిస్తారట.  బాబా కు నేడు ధూప దీపాలతో  వైభవంగా పూజించాలి. అలాగే గురువారం రోజున మాంసాహారం అసలు ముట్టరాదు. నిజానికి బాబాకు జీవ హింస అస్సలు ఇష్టం ఉండదు. ఈ విధంగా గురువారం రోజున ఈ నియమాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో బాబా ని పూజిస్తే అంతా మంచే జరుగుతుంది. ఇక ఈ రోజు సాయంత్రం బాబాను పూజిస్తూ ఆయన మంత్రోచ్చారణ చేస్తే అంత మంచి జరిగి మీరు అనుకున్న అన్ని కోరికలను ఆయన తీరుస్తాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: