భక్తి: ఈ ఆలయంలో పీతలను నైవేద్యంగా పెడితే.. సమస్యలు తొలగిపోతాయట

N.ANJI
సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు మనం దేవుడికి నైవేద్యంగా ఏ పండు, ఫలము, ఏదైనా తీపి వంటకాన్ని పెడుతుంటారు. అయితే ఓ దేవుడికి నైవేద్యంగా పీతలను నైవేద్యంగా సమర్పించడం మీరు ఎపుడైనా విన్నారా. ఇది వినడాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కానీ అదే వాస్తవం. ఇక గుజరాత్, సూరత్ లో ఉన్న శివాలయంలో భక్తులు స్వామివారికి బ్రతికున్న పీతలను నైవేద్యంగా పెడుతుంటారు. అయితే దేవుడికి పీతలను ఎందుకు సమర్పిస్తారో ఒక్కసారి చూద్దామా.
అయితే పురాణాల ప్రకారం శివుడికి పరమ భక్తుడైన భక్త కన్నప్ప ప్రతిరోజు స్వామి వారికి ఏదో ఒక నైవేద్యాన్ని పెడుతూ ఉండేవాడు. ఇక దేవుడిపై ఉన్న భక్తితో భక్తకన్నప్ప ఒకరోజు స్వామి వారికి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించిన విషయం అందరికి తెలిసిన విదితమే. స్వామి వారికీ  భక్తితో సమర్పించిన ఎలాంటి నైవేద్యం అయినా స్వీకరిస్తారని విషయం భక్తకన్నప్ప ఋజువు చేశాడు. అంతేకాదు.. ప్రస్తుతం గుజరాత్ సముద్రతీరంలో పిక్నిక్ స్పాట్‌గా ప్రసిద్ధి చెందిన గల్టేశ్వర్, శివుడికి అంకితం చేయబడిన ఆలయంలో  భక్తుల కోరికలను తీర్చడంలో ఆ పరమశివుడు ముందుంటారని నమ్ముతుంటారు.
భక్తులు స్వామివారిని భక్తి శ్రద్దలతో స్వామివారిని పూజిస్తే వారి కోరికలు తప్పక నెరవేరుతాయని అందరు నమ్ముతుంటారు. అంతేకాక.. గుజరాత్ లోని  సూరత్ లో ఉన్న శివ భక్తులు కూడా స్వామి వారిని ఈ విధంగానే నమ్ముతుంటారు. అలాగే గుజరాత్ లోని ఉమ్రాలో రామ్‌నాథ్ శివ ఘేలా గుడి ఉంది. ఇక ఆ గుడికి వచ్చిన భక్తులు స్వామివారికి బతికి ఉన్న పీతలను నైవేద్యంగా సమర్పించడం వల్ల వారికి చెవిలో వచ్చే సమస్యలు తొలగిపోతాయని నమ్ముతుంటారు.
అయితే ఈ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారికి పీతలను పెడుతుంటారు. వాటిని సమర్పించడం వలన  వారికి చెవిలో వచ్చే సమస్యలు తొలగిపోతాయని అక్కడి ప్రజలు విశ్వసిస్తుంటారు. అంతేకాదు.. ఈ ఆలయానికి ప్రతి ఏటా మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని భక్తులు పెద్దఎత్తున ఆలయాన్ని సందర్శించి స్వామి వారికి పీతలను నైవేద్యంగా సమర్పించడం విశేషం అనే చెప్పాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

god

సంబంధిత వార్తలు: