అంత్యక్రియల తరువాత వెనక్కి తిరిగి చూడొద్దు... ఎందుకు ?

Vimalatha
గరుడ పురాణం 18 పురాణాలలో ఒకటి. ఈ 18 పురాణాలలో మరణానంతర ప్రక్రియ గురించి ప్రస్తావించబడినది గరుడ పురాణంలో మాత్రమే. గరుడ పురాణంలోని దహన నియమాల ప్రకారం అంత్యక్రియల తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. దీని వెనుక కారణం ఏమిటో తెలుసుకుందాం. ఆత్మకు దాని శరీరంతో ఉన్న అనుబంధం గురించి గరుడ పురాణంలో పేర్కొనబడింది, మరణం తరువాత మానవ శరీరం నాశనం అవుతుంది. కానీ ఆత్మ కూడా నాశనం కాదు. ఒక వ్యక్తి యొక్క ఆత్మ తన సూక్ష్మ శరీరాన్ని క్షారపరచిన తర్వాత, ఇతర లోకాలలో తన పాపాలను, పుణ్యాలను అనుభవిస్తుంది. సమయం వచ్చిన తర్వాత అతను మళ్లీ మానవ జన్మ పొందుతాడు. కానీ మరణం తర్వాత కూడా ఆత్మ దాని శరీరం నుండి వేరు కాదు. అందుకే అది చనిపోయిన తర్వాత కూడా తన శరీరం ఆత్మ రూపం లో కాలిపోతున్నట్లు చూస్తుంది. ఆత్మను ఈ భ్రాంతి బంధనము నుండి విముక్తం చేయడానికి వెనక్కి తిరిగి చూడకూడదు.
గరుడ పురాణం ప్రకారం శరీరాన్ని కాల్చేసిన తరువాత ఆత్మ దగ్గరి బంధువు ల పట్ల ఆకర్షితులై వారితో తిరిగి వెళ్లాలనుకుంటుంది. అటువంటి పరిస్థితిలో బంధువులు వెనక్కి తిరిగి చూస్తే, వారు ఇప్పటికీ ఆ వ్యక్తితో అనుబంధంగా ఉన్నారని అనిపిస్తుంది. అలాంటి పరిస్థితిలో ఆత్మ కు అనుబంధం నుండి విముక్తి పొందడం సులభం కాదు. అందుకే అంత్యక్రియల తరువాత ఎవరూ వెనక్కి తిరిగి చూడకూడదు. ఇలా చేయడం ద్వారా ఆత్మకు ఇప్పుడు ఆ బంధం నుండి విముక్తి పొందే సమయం ఆసన్నమైందని అర్థమవుతుంది.
దహన సంస్కారాలు చేసిన తర్వాత ఆత్మ తన బంధువులను అనుసరిస్తుందని, శరీరం కోసం వెతుకుతుందని కూడా ఒక నమ్మకం ఉంది. అటువంటి పరిస్థితిలో ఎవరైనా వెనక్కి తిరిగి చూస్తే ఆత్మ ఆ శరీరాన్ని స్వాధీనం చేసుకుంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: