శివుడికి ప్రీతిపాత్రమైన జమ్మి... అసలు కథ ఏమిటంటే ?

Vimalatha
సోమవారం భోలేనాథ్‌ ను పూజిస్తారు. ప్రత్యేకించి ఈ రోజున పూర్తి విశ్వాసంతో పూజిస్తే శివుడు ఖచ్చితంగా శివ భక్తుల పిలుపులను వింటాడు. సోమవారం నాడు భక్తులు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి బిల్వ ఆకులు, పువ్వులు, దాతురా, గంజాయి మొదలైన వాటిని సమర్పిస్తారు. శివ పురాణం ప్రకారం, శివారాధనలో జమ్మి చెట్టు ఆకులను కూడా చేర్చినట్లయితే శివుడు చాలా త్వరగా ప్రసన్నుడై తన భక్తుల కోరికలను తీరుస్తాడు. ఆయన భక్తులకు మోక్షం లభిస్తుంది.
పౌరాణిక నమ్మకం అంటే ఏమిటి ?
పౌరాణిక విశ్వాసాలలో జమ్మి వృక్షాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం లంకను జయించిన తర్వాత శ్రీరాముడు వచ్చినప్పుడు జమ్మి వృక్షాన్ని కూడా పూజించాడు. మహాభారత కాలంలో పాండవులకు అజ్ఞాతవాసం ఇచ్చినప్పుడు, వారు తమ ఆయుధాలను జమ్మి వృక్షంలోనే దాచారని కూడా నమ్ముతారు. నవ రాత్రులలో కూడా దుర్గా దేవిని శమీ చెట్టు ఆకులతో పూజించాలని ఆచారం ఉంది. శివుడి తో పాటు గణేష్, శని దేవుళ్ళకు ఇద్దరికీ జమ్మి చాలా ప్రియమైనది.
సోమవారం నాడు స్నానం చేసి , శివాలయానికి వెళ్లి తూర్పు లేదా ఉత్తరం వైపుకు వెళ్లి, గంగాజలం, తెల్ల చందనం, బియ్యం మొదలైన వాటిని రాగి పాత్రలో కలపండి. శివలింగానికి అభిషేకం చేయండి. అభిషేకం చేస్తున్నప్పుడు 'ఓం నమః శివాయ' అనే మంత్రాన్ని జపించండి. అభిషేకం పూర్తయ్యాక శివుడికి బిల్వ పత్రాలు, తెల్లని వస్త్రాలు, బియ్యం, జమ్మి ఆకులను సమర్పించండి. వీలైతే జమ్మి ఆకులను సమర్పించేటప్పుడు ఈ మంత్రాన్ని జపించండి.
అమంగలానాం చ శమ్నీ శమనీ దుష్కృత్య చ ।
దుస్వప్రణాశినిం ధన్యాన్ ప్రపద్యేహం శమీ శుభమ్ ।
జమ్మి పత్రాన్ని సమర్పించిన తరువాత ధూపం, దీపం మరియు కర్పూరం తో శివునికి హారతి ఇవ్వండి. ఇదన్న మాట శివ పూజ లో జమ్మి ఆకుల కథ, దాని ప్రాముఖ్యత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: