వర "లక్ష్మి" వ్రత కథ ఇదే..!
మగధ దేశంలో కుండినం అనే ఒక పట్టణం కలదు.ఆ పట్టణము అంతా బంగారు గోడలు గల యిండ్లతో రమణీయంగా ఉండేది.. అలాంటి పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ స్త్రీ భర్తను దేవునితో సమానముగ పూజించేది ప్రతి రోజు ఉదయాన్నే లేచి సూచి శుభ్రంగా స్నానంబుచేసి పుష్పాలతో భర్తకు పూజచేసి తరువాత అత్తమామలకు సేవలు చేసి ఇంటిని చక్క బెట్టేది.అయితే ఒకరోజు రాత్రి చారుమతి నిద్రిస్తున్న సమయంలో “ఓ చారుమతీ, నేను వరలక్ష్మీ దేవిని. నీయందు నాకు అనుగ్రహము గలిగి నీకు ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చె శుక్రవారమునాడు నన్ను పూజించిన నీవు కోరిన వరములు ఇచ్చెదను అని చెప్పెను. చారుమతీ దేవి ఆ దేవిని చూసి కలలోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి ‘ నీ కటాక్షం ఉంటే చాలు జనులు ధన్యులుగను తల్లి. , విద్వాంసులుగను సకల సంపన్నులు అవుతారు అని అనెను.ఒక్కసారిగా కల చెదిరిన తరువాత నిద్రలోంచి మేల్కొన్న చారుమతి ఇంటి నాలుగు వైపులా చూడగా ఎవరు లేరు. ఇది కలగా భావించి తనకు వచ్చిన ఈ స్వప్నమును భర్త అత్తమామలు,చుట్టు పక్కల స్త్రీలకు చెప్పెను.అలాగే చారుమతి స్వప్నంబు విన్న స్త్రీలు అందరు శ్రావణమాసం కోసం వేచి చూస్తూ ఉండెను. ఎప్పుడు వచ్చునాయని ఎదురు చూచుచుండిరి. శ్రావణ మాసం రానే వచ్చింది. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చెడి శుక్రవారము వచ్చెను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరు ఉదయాన్నే లేచి స్నానాములు జేసి కొత్త బట్టలు కట్టుకుని చారుమతీదేవి గృహమునకు వచ్చేరి. పిదప దేవుని మండపం శుభ్రం చేసి ఆసనంబువైచి దానిపై కొత్తబియ్యం బోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచపల్లవంబులచేత కలశం ఏర్పరిచి యందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరు భక్తియుక్తులై లక్ష్మి దేవుని పూజించడం మొదలుపెట్టారు.
పూజల అనంతరం తొమ్మిది సూత్రములు గల తోరంబును దక్షిణహస్తమునకు గట్టుకొని వరలక్ష్మీదేవికి వివిధ రకాల ప్రసాదములు నివేదన జేసి ప్రదక్షిణము జేసిరి. మొదటి ప్రదక్షిణము జేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు ఘల్లుఘల్లుమను నొక శబ్దము కలిగెను. అంత కాళ్ళను చూడగా గజ్జెలు మొదలగు నాభరణములు వచ్చెను. అవి చూసి స్త్రీలు అందరు సంతోషించి వరలక్ష్మీదేవి కటాక్షం వలన గల్గినవని అనుకున్నారు.రెండో ప్రదక్షిణంబు జేయగా హస్తములందు నవరత్న ఆభరణములు కలిగెనో. మూడవ ప్రదక్షిణంబు చేయగానే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. చారుమతి మొదలగు నా స్త్రీల అందరి గృహాలు బంగారు ఆభరణాలు విరిసిల్లెను! పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరంబును నీ వ్రతంబును చేయుచున్నారు. కావున ఓ పార్వతీ! యీ యుత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును చేయవచ్చును.అని శివుడు పార్వతికి చెప్పెను.