శివరాత్రి రోజున ఉపవాసం ఉండే ముందు ఒకసారి ఇది చదవండి.. !!
దీని కోసం ఏం చేయాలనే దాని గురించి వైద్య నిపుణులు పలు సూచనలు ఇచ్చారు.అవేంటంటే ఉపవాసం ఉండే రోజు కనీసం ఒక 6 సార్లు ఒక్కోసారి ఒక్కో సలాడ్ కప్పు పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. పండ్లు తినడం వలన శక్తి వస్తుంది. అలాగే పుచ్చకాయ తినడం కూడా చాలా మంచిది. ఎందుకంటే పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే బొప్పాయిలో విటమిన్లు అధికం. అందుకని పుచ్చకాయ, బొప్పాయి సలాడ్ తీసుకోవాలి. ఉపవాసం ఉండేవాళ్ళు గ్లాసుడు పాలు, అరటిపండు కలిపి మిల్క్ షేక్ లాంటివి చేసుకుని తాగితే చాలా మంచిది.
ఇలా ఈ జ్యూస్ తాగడం వలన ఆకలి వేస్తున్నది అనే భావన ఉండదు.అలాగే కొంతమంది పాలు తాగడానికి ఇష్టపడరు. అలాంటివారు పలచటి మజ్జిగ తీసుకోవచ్చు.శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేసేవాళ్లు సాయంకాలం కొబ్బరి నీళ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే తగినంత శక్తి లభిస్తుంది. దేవుని మీద భక్తి ఎంత ముఖ్యమో ఆరోగ్యం మీద శ్రద్ద కూడా అంతే ముఖ్యం.ఉపవాసం ఉండి నిరసించి పోతే భక్తి మాట ఏమోగానీ నీరసం వలన మన ద్యాస అంతా దేవుడి మీద ఉండదు. పూజలలో పూర్తి శ్రద్ధ పెట్టాలంటే మన ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలి. అప్పుడే ఉపవాస దీక్ష మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది.