ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరాలంటే వీటిని పాటించాల్సిందే..!
కాబట్టి శ్రీ మహాలక్ష్మీని ప్రసన్నం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఇందుకోసం కొన్నింటిని తప్పకుండా పాటించాలి. లక్ష్మీ దేవి అనుగ్రహం పొందితే ఆర్థిక సంబంధిత సమస్యలన్నీ తొలుగుతాయని నమ్ముతారు. చాలా మంది తమ ఇళ్లల్లో ఆహారాన్ని వృధా చేస్తుంటారు.అంతేకాకుండా బయట ప్రదేశాల్లోనూ ఆహారాన్ని వృధా చేస్తారు. ఈ విధంగా చేసినట్లయితే లక్ష్మీ దేవి అనుగ్రహం మీకు కలగదు. కోపంతో అన్నాన్ని విసిరి కొట్టడం, పారేయడం లాంటివి అస్సలు చేయకూడదు. ఈ విధంగా చేస్తే ఇంట్లో సంపద అస్సలు ఉండదు. అంతేకాకుండా సంతోషం కూడా కరవవుతుంది. ఆహారాన్ని వృధా చేయకుండా ఆకలితో ఉన్నవారి ఆకలి తీరిస్తే లక్ష్మీ దేవి ప్రసన్నమవుతుంది.
మీరు సమస్యలతో ఇరకాటంలో ఉన్నా లేదా చిక్కల్లో ఉంటే శుక్రవారం రోజు మహాలక్ష్మీకి శంఖువు, చక్రం, తామర పువ్వును దేవికి అర్పించాలి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వచ్ఛమైన నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించేటప్పుడు దయచేసి మీ మనస్సులో ఎల్లప్పుడూ లక్ష్మీ దేవిని ప్రార్థిస్తే మంచిది. భవిష్యత్తును కట్టడి చేయాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవాలి. దీపం చాల్లరిన అనంతరం వెంటనే దాన్ని ప్రవహించే నీటిలో కలపాలి.