హార్ట్ ఎటాక్ తో చనిపోయిన కోళ్లు.. ఎక్కడంటే..?
ఫౌల్ట్రీ ఫామ్లో ఉన్న తమ కోళ్లు డీజే సౌండ్ పొల్యూషన్ కారణంగా చనిపోయినట్టు ఓ మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమ ఊళ్లో జరిగిన పెళ్లి ఊరేగింపులో వెలువడిన శబ్ధాల కారణంగానే కోళ్లు చనిపోయాయని ఆరోపించింది. బాలాసోర్ జిల్లా మైతాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో పెళ్లి బరాత్ ఊరేగింపు ప్రారంభమైంది. ఈ వేడుకలో చాలా ఎక్కువ మ్యూజిక్ సౌండ్ చేయడంతో పాటు పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చారని రంజిత్ పరిదా అనే మహిళ వెల్లడించింది. ఈ శబ్బ కాలుష్యం వల్ల తన పౌల్ట్రీలోని 63 బ్రాయిలర్ కోళ్లు మృతి చెందినట్టు తెలిపింది.
సౌండ్ తగ్గించాలని పెళ్లి వాళ్లని కోరినా తనను పట్టించుకోలేదని చెప్పింది. పైగా మద్యం మత్తులో తనను దూషించాలని చెప్పుకొచ్చింది. తన ఫౌల్ట్రీ ఫామ్లో మొత్తం 200 కోళ్లు ఉండగా భయంతో పరుగులు తీశాయని తెలిపింది. గంట తరువాత అందులోని 63 కోళ్లు చనిపోయాయని ఫరిదా ఆవేదన వ్యక్తం చేసింది. బాధితత మహిళ రైతు స్థానిక పశువైద్యుడిని సంప్రదించగా భారీ శబ్దాల వల్లే షాక్కు గురై చనిపోయినట్టు నిదర్దారించారు. ఈ ఘటనకు కారణమైన రామంచంద్ర అనే వ్యక్తి నుంచి పరిదా పరిహారం కోరింది. కానీ, మహిళ ఆరోపణలు నిరాదారణమని నష్టపరిహారం చెల్లించేందుకు ఆ వ్యక్తి నిరాకరించాడు.