అతని బ్యాటింగ్.. సచిన్ ను కూడా ఫిదా చేసేసింది?

praveen
ప్రస్తుతం ఐపీఎల్ లో లీగ్ మ్యాచ్ లు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఐపీఎల్ పోరు మరింత రసవతరంగా  మారిపోయింది అని చెప్పాలి  ఈ క్రమంలోనే జట్టును గెలిపించుకోవడమె లక్ష్యంగా ప్రతి ఒక్క ఆటగాడు కూడా మంచి ప్రదర్శన చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొన్నటి వరకు పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన ఆటగాళ్లు సైతం సెంచరీలతో చెలరేగిపోతూ ఉండడం చూస్తూ ఉన్నాం. మొన్నటికీ మొన్న సన్రైజర్స్ హైదరాబాద్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సెంచరీల మోత మోగించారు ఇరు జట్ల. ఆటగాళ్లు బెంగళూరు జట్టు తరఫున విరాట్ కోహ్లీ సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోయి సెంచరీ చేసి అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే.

 అదే సమయంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న క్లాస్సెన్ సైతం మెరుపు సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. తక్కువ పరుగులకే వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సన్రైజర్స్ జట్టును ఒంటరి పోరాటం చేసి ఆదుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సన్రైజర్స్ కి ఒక గౌరవప్రదమైన స్కోర్ అందించగలిగాడు. అయితే ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో సన్రైజర్స్ జట్టు ఓడిపోయినప్పటికీ అటు క్లాసెన్ చేసిన మెరుపు సెంచరీ మాత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది అని చెప్పాలి.

 ఇలా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాట్స్మెన్ క్లాసేన్ చేసిన సెంచరీపై టీమ్ ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్ లో రెండు వందల స్ట్రైక్ రేట్ తో సెంచరీ చేయడం నిజంగా గొప్ప విషయం అంటూ క్లాసేన్ ను అభినందించాడు సచిన్ టెండూల్కర్. ఈ మధ్యకాలంలో తాను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్ లలో ఇది ఒకటి అంటూ ప్రశంసించాడు. ఆర్సిబి తో జరిగిన మ్యాచ్లో క్లాసేన్ సాంప్రదాయమైన షాట్లతోపాటు... క్రియేటివ్ షాట్లు కూడా ఆడాడు అంటూ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: