హాఫ్ సెంచరీ తర్వాత.. అందుకే వింత సైగలు చేసా : పృథ్వి షా

praveen
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృద్విషా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఎంత దారుణమైన వైఫల్యాన్ని కొనసాగించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని మ్యాచ్లలో అవకాశం ఇచ్చిన అతను మాత్రం నిరూపించుకోలేకపోయాడు. ఓపనర్ గా  బరిలోకి దిగుతూ చెత్త ప్రదర్శనలతో జట్టుకు భారంగా మారిపోయాడు అని చెప్పాలి. ఎన్నిసార్లు విఫలమవుతున్న ఎందుకొ అతని ఇంకా జట్టులో కొనసాగిస్తున్నారు అంటూ ఢిల్లీ జట్టు యాజమాన్యంపై ఆ జట్టు అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితులను తెచ్చుకున్నాడు.  అయితే ఇటీవలే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో మాత్రం వరుస వైఫల్యాలకు పృథ్విషా చెక్ పెట్టాడు అని చెప్పాలి.

 మెరుపు హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. ఇటీవల బౌలర్లపై వీర విహారం చేసి 36 బంతులు ఆరు ఫోర్లు, సిక్సర్ సహాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు పృథ్వి షా. అయితే పృథ్విష బ్యాట్ నుంచి ఇలా హాఫ్ సెంచరీ రావడంతో అభిమానులు అందరూ కూడా సంబరాలు చేసుకున్నారు అని చెప్పాలి. అయితే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత డగవుట్ వైపు చూపిస్తూ పృథ్విషా  వింత సంబరాలు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇది చూసి అందరూ షాక్ అయ్యారు.  అయితే తన వింత సంబరాలు వెనక కారణం ఏంటి అన్న విషయాన్ని ప్రతి విషయం తెలిపాడు.

 ఇన్నింగ్స్ పూర్తయిన తర్వాత ఎందుకు అలాంటి సెలబ్రేషన్స్ చేసుకున్నారు అంటూ పృద్విషాను వివరణ కోరగా.. అసలు కారణం చెప్పుకొచ్చాడు. పంజాబ్ కింగ్స్ ఫెసర్ లు వేసిన బౌన్సర్లతో తన రెండు చేతులకు గాయాలు అయ్యాయని.. అదే విషయాన్ని తమ డగ్ అవుట్ లో తెలిసేలా సెలబ్రేషన్స్ చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. చాలా రోజుల తర్వాత హాఫ్ సెంచరీ సాధించడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ తెలిపాడు. కొన్నిసార్లు ఎంత కష్టపడినా ప్రతిఫలం దక్కదు. కాస్త ఆలస్యం అవుతూ ఉంటుంది. పిచ్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంది. బంతి నేరుగా బ్యాట్ మీదికి వస్తుంది అంటూ పృథ్విషా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: